Crime News: మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఆమె కథ మారలేదు.. చివరికి ఏమైందంటే..?
- యూపీలోని ఝాన్సీలో షాకింగ్ కేసు
- టాయిలెట్ క్లీనర్ తాగించి తన కుమార్తెను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపణ
- పెళ్లయినప్పటి నుంచి కొట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడని చెబుతున్న పేరెంట్స్
- భర్తతో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఝాన్సీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్త, అత్తమామల ప్రేమను పొందడానికి ఒకసారి కాదు మూడు సార్లు వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఆమె జీవితంలో ఆనందం కరువైంది. చివరికి ఆ మహిళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లింది. టాయిలెట్ క్లీనర్ తాగించి తన కుమార్తెను భర్త, అత్తమామలు హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త తనను కొట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో టాయిలెట్ క్లీనర్ తాగించి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై భర్తతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
వివరాల్లోకి వెళ్తే.. ఓర్చా గేట్ ప్రాంతానికి చెందిన దుర్గా దేవికి ఉన్నావ్ గేట్ ప్రాంతానికి చెందిన రాహుల్ అనే యువకుడితో వివాహం జరిగింది. జూన్ 18న ఇంట్లో భర్తతో గొడవపడి, అత్తమామలు దుర్గాదేవిని బలవంతంగా టాయిలెట్ క్లీనర్ తాగించారని, దీంతో ఆమె పరిస్థితి విషమించిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే.. డబ్బుల కోసం భర్త తరచూ కొట్టేవాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త రాహుల్ చీరల దుకాణంలో పనిచేసేవాడని.. అతను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాడని పేర్కొన్నారు. దీంతో తల్లి ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను తరచూ డిమాండ్ చేసేవాడని చెప్పారు.
UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 80 పైగా మృతి..
ఇదిలా ఉంటే.. మృతురాలు దుర్గాదేవికి ఒకటి కాదు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురితో సంసారం ఎక్కువ కాలం నిలవలేదు. దుర్గాదేవి మొదటి వివాహం 11 సంవత్సరాల క్రితం మహోబాలోని చరఖారీలో జరిగింది. మొదటి భర్త మద్యానికి బానిస కావడంతో.. మద్యం సేవించి తరచూ ఆమెను కొట్టేవాడు. అయితే.. ఆ సమయంలో ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత కూడా భర్త తాగుడు మానకపోవడంతో విడాకులు తీసుకుంది. అనంతరం.. ఐదేళ్ల క్రితం మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే.. అతను వేరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో.. ఏడాది పాటు సహజీవనం చేసి అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత.. 2021లో రాహుల్తో మూడో పెళ్లి చేసుకుంది. రాహుల్కి కూడా ఇది రెండో పెళ్లి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!