AI: తీవ్ర ప్రమాదంలో మానవుడు.. 5-10 ఏళ్లలో ఏఐ మానవాళిని నాశనం చేయగలదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూనే ప్రస్తుతం టెక్ ప్రపంచం తిరుగుతోంది. గూగుల్ తో సహా పలు కంపెనీలు ఏఐని అభివృద్ధి చేస్తున్నాయి. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంేట దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో..లోపాలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయని చాలా మంది అగ్రశ్రేణి టెక్ సీఈఓలు నమ్ముతున్నారు. ట్విట్టర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ దిశగా హెచ్చరికలు చేశారు. ఈ వారం ప్రారంభంలోని యేల్ సీఈఓ సమ్మిట్ లో సీఎన్ఎన్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 42 శాతం సీఈఓలు కృత్రిమ మేథ వలన రాబోయే కొన్ని ఏళ్లలో మానవాళిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని నమ్ముతున్నారు.
Read Also: LGM Movie: రిలీజ్కి సిద్ధమవుతోన్న ధోని ఎంటర్టైన్మెంట్ మూవీ ‘LGM’
Also Read
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
దాదాపుగా 42 శాతం సీఈఓలు, అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాలు ఐదు పదేళ్లలో ఏఐ నుంచి మానవాళికి తీవ్ర ప్రమాదం ఉందని, మానవాళిని నాశనం చేసే సామర్థ్యం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సర్వేలో వాల్మార్ట్, కోకా-కోలా, జిరాక్స్, జూమ్ వంటి వ్యాపార సంస్థల సీఈఓలు 119 మంది పాల్గొన్నారు. నివేదిక ప్రకారం దాదాపు 34 శాతం మంది సీఈఓలు AI పదేళ్లలో మానవాళిని నాశనం చేయగలదని చెప్పగా, వారిలో 8 శాతం మంది కేవలం ఐదేళ్లలో విధ్వంసం జరగవచ్చని చెప్పారు. 58 శాతం మంది సీఈఓలు మాత్రం ఏఐ ఎప్పటికీ మానవుడికి ప్రమాదం కాదని, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఎలాన్ మస్క్ తో పాటు OpenAI వ్యవస్థాపకుడు కూడా ఏఐ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఏఐ పరిశ్రమలకు సంబంధించిన నాయకకులు, మరికొందరు టెక్ కంపెనీ సీఈఓలు ఏఐ ప్రమాదం గురించి హెచ్చరించే ప్రకటనపై సంతకం చేశారు. దీని తర్వాత తాజా నివేదిక వెలుగులోకి వచ్చింది. సంతకాలు చేసిన వారిలో ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్మాన్, జియోఫ్రి హింటన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన టెక్ దిగ్గజాలు ఉన్నారు.
తాజావార్తలు
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!