AI: తీవ్ర ప్రమాదంలో మానవుడు.. 5-10 ఏళ్లలో ఏఐ మానవాళిని నాశనం చేయగలదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూనే ప్రస్తుతం టెక్ ప్రపంచం తిరుగుతోంది. గూగుల్ తో సహా పలు కంపెనీలు ఏఐని అభివృద్ధి చేస్తున్నాయి. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంేట దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో..లోపాలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయని చాలా మంది అగ్రశ్రేణి టెక్ సీఈఓలు నమ్ముతున్నారు. ట్విట్టర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ దిశగా హెచ్చరికలు చేశారు. ఈ వారం ప్రారంభంలోని యేల్ సీఈఓ సమ్మిట్ లో సీఎన్ఎన్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 42 శాతం సీఈఓలు కృత్రిమ మేథ వలన రాబోయే కొన్ని ఏళ్లలో మానవాళిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని నమ్ముతున్నారు.
Read Also: LGM Movie: రిలీజ్కి సిద్ధమవుతోన్న ధోని ఎంటర్టైన్మెంట్ మూవీ ‘LGM’
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
దాదాపుగా 42 శాతం సీఈఓలు, అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాలు ఐదు పదేళ్లలో ఏఐ నుంచి మానవాళికి తీవ్ర ప్రమాదం ఉందని, మానవాళిని నాశనం చేసే సామర్థ్యం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సర్వేలో వాల్మార్ట్, కోకా-కోలా, జిరాక్స్, జూమ్ వంటి వ్యాపార సంస్థల సీఈఓలు 119 మంది పాల్గొన్నారు. నివేదిక ప్రకారం దాదాపు 34 శాతం మంది సీఈఓలు AI పదేళ్లలో మానవాళిని నాశనం చేయగలదని చెప్పగా, వారిలో 8 శాతం మంది కేవలం ఐదేళ్లలో విధ్వంసం జరగవచ్చని చెప్పారు. 58 శాతం మంది సీఈఓలు మాత్రం ఏఐ ఎప్పటికీ మానవుడికి ప్రమాదం కాదని, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఎలాన్ మస్క్ తో పాటు OpenAI వ్యవస్థాపకుడు కూడా ఏఐ ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఏఐ పరిశ్రమలకు సంబంధించిన నాయకకులు, మరికొందరు టెక్ కంపెనీ సీఈఓలు ఏఐ ప్రమాదం గురించి హెచ్చరించే ప్రకటనపై సంతకం చేశారు. దీని తర్వాత తాజా నివేదిక వెలుగులోకి వచ్చింది. సంతకాలు చేసిన వారిలో ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్మాన్, జియోఫ్రి హింటన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన టెక్ దిగ్గజాలు ఉన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!