Houthi Rebels: మళ్లీ రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. యూఏఈకి వెళ్తున్న ఓడ సమీపంలో పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthi Rebels: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో యెమెన్ హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో భీభత్సాన్ని సృష్టిస్తున్నారు. నవంబర్ నుంచి హౌతీలు ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందాబ్ జలసంధి, ఏడెన్ గల్ఫ్లోని ముఖ్యమైన షిప్పింగ్ యార్డ్ ల పరిధిలోని నౌకలపై పదే పదే డ్రోన్, క్షిపణిలతో దాడులను నిర్వహిస్తుంది. తాజాగా, గురువారం యెమెన్ నౌకాశ్రయ నగరమైన మోఖాకు పశ్చిమాన 19 నాటికల్ మైళ్ల దూరంలో ఎర్ర సముద్రం సమీపంలో పేలుడు సంభవించినట్లు ఒక వ్యాపార నౌక వెల్లడించింది. దీనిపై బ్రిటిష్ అధికారులు విచారణ చేస్తున్నారు.
Read Also: Shoaib Akhtar:”1999 ప్రపంచ కప్ చరిత్రను పాకిస్తాన్ జట్టు మరోసారి పునారావృతం చేసింది”
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ఇక, యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) కూడా మోఖాకు దక్షిణాన 27 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన సంఘటన గురించి నివేదిక వచ్చిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు బ్రిటిష్ అధికారులు వెల్లడించారు. యూరప్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్తున్న వాణిజ్య నౌక వెళ్తోందని ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఆ ఓడ సమీపంలో పేలుడు సంభవించడంతో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సిగ్నల్స్ పంపలేదు అని పేర్కొంది.
Read Also: CS Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్.
కాగా, హౌతీ తిరుగుబాటుదారులు నౌకలపై తరచూ దాడులు చేయడం వల్ల ఓడ వాహక నౌకలు తమ సరుకులను దక్షిణాఫ్రికా చుట్టూ సుదీర్ఘమైన ప్రయాణాలకు చేయవల్సి వస్తుందని భద్రతా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మధ్య ప్రాచ్యంలో అస్థిరతను సృష్టించే అవకాశం ఉందని భయపడుతున్నారు. అలాగే, ఇరాన్తో సంబంధాలను కలిగి ఉన్న హౌతీ మిలీషియా, యెమెన్లోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలను నియంత్రిస్తుంది. గాజాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ హౌతీ రెబల్స్ పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!