Doctor commits suicide: జోధ్పూర్లో డాక్టర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో భార్య పేరు
- రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ నగరంలో
- హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య
- సూసైడ్ నోట్లో భార్య పేరు
Doctor commits suicide: రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ నగరంలో 35 సంవత్సరాల హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు, ఆయన తన భార్య సుమన్పై ఆరోపణలు చేసిన సుసైడ్ నోట్ లో తెలిపారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరు లోని అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తు చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సుసైడ్ నోట్ లో ఇంటి వివాదాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధానంగా నిలిచాయి.
డాక్టర్ అజయ్ కుమార్ జోధ్పూర్ లోని కీర్తి నగరంలో ఉన్న తన క్లినిక్ లో ఉరి వేసుకుని కనిపించాడు. అతను కాల్స్ కి స్పందచక పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందారు. దీంతో, ఒక తెలిసిన వ్యక్తి క్లినిక్ కు వెళ్లి చూడా ఉరి వేసుకొని ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అజయ్ తన సుసైడ్ నోట్ లో తన భార్య సుమన్ పై మానసిక హింస చేసిందని పేర్కొన్నదని తెలిపారు. ఆ నోట్లో తన పోరాటాన్ని, నిరాశను వ్యక్తం చేశాడు.
Also Read
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
- Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
- Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
- 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read: Allu Arjun : పొరపాటున సుకుమార్ అసలు పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్..సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
డాక్టర్ అజయ్, సుమన్ లకు 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి నాలుగు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ పిల్లవాడు సుమన్ తో కలిసి జైపూర్ లో ఉన్నాడు. అజయ్ కుమార్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, సుమన్ అజయ్ ను చాలా కాలం నుంచి మానసికంగా వేధించిందని, ఇది ఆయన జీవితంలో తీవ్ర ఒత్తిడిని కలిగించిందని పేర్కొన్నారు. ఈ సంఘటన ఇటీవల బెంగళూరు లో జరిగిన అటుల్ సుభాష్ ఆత్మహత్య కేసును మళ్లీ గుర్తు చేస్తోంది. అటుల్ సుభాష్ కూడా తన భార్యపై పెళ్లి, విడాకుల మరియు కస్టడీ వివాదాల కారణంగా వేధింపులు జరిగినట్టు తెలిపి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసు అధికారులు ఈ సంఘటనపై కేసును నమోదు చేసి, డాక్టర్ అజయ్ కుమార్ శవం పోస్టుమార్టం కోసం మహాత్మా గాంధీ ఆస్పత్రికి పంపారు. ఆయన కుటుంబ సభ్యులు రాగా శవాన్ని వారికి అప్పగించనున్నారు. పోలీసు అధికారులు సుసైడ్ నోట్, కుటుంబ సంబంధాల వివాదాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకొని కేసు పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
-
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
-
Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
-
1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!