Vangalapudi Anitha: వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన హోంమంత్రి..
- వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన హోంమంత్రి అనిత
- రూ. 10 లక్షల చెక్కును అందించిన హోంమంత్రి అనిత
- చిన్నారిపై అఘాయిత్యం బాధేసింది- అనిత
- చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్యచేయడం మరింత బాధించింది- హోంమంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం వారికి.. పది లక్షల చెక్కును అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిన్నారిపై అఘాయిత్యం బాదేసింది.. చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్య చేయడం మరింత బాధించిందని తెలిపారు. అలిమేలు మంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. చిన్నారి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని హోంమంత్రి పేర్కొన్నారు. ఘటన జరిగిన తరువాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశాం.. పోలీసులు వెంటనే స్పందించారు.. మద్యం మత్తులో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడని అన్నారు.
UP: లంచం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్లు.. వారిని బంధించి చితక బాదిన గ్రామస్థులు (వీడియో)
Also Read
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం.. ఈ కేసును ప్రత్యేక కోర్టుకు అప్పచెబుతాం.. మూడు నెలల్లో నిందితుడిని శిక్షిస్తామని హోంమంత్రి తెలిపారు. గత ఐదేళ్ళలో పోలీసు వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేసింది.. ఈ ఘటనను రాజకీయం చేయడం విడ్డూరం అని దుయ్యబట్టారు. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది.. చిన్నపిల్లల మరణాల్ని వైసీపీ రాజకీయం చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద చల్లొద్దు.. క్రైం రికార్డు చూస్తే గత ఐదేళ్ళలో ఎన్నో ఘటనలు జరిగాయి.. పులివెందులలో మహిళపై అత్యాచారం జరిగితే జగన్ ఎందుకు నిందితుడిని శిక్షించలేదని ప్రశ్నించారు.
Yogi Adhityanath: సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు
రాష్ట్రంలో సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం.. దిశ యాప్ అంటూ రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని హోంమంత్రి అన్నారు. చంద్రబాబు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డగా చూస్తున్నారు.. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వద్దు.. జగన్ చేష్టలను దేవుడు కూడా క్షమించడని ఆరోపించారు. వైసీపీ హయాంలో మద్యం ఏరులై పారింది.. మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!