UP: లంచం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్లు.. వారిని బంధించి చితక బాదిన గ్రామస్థులు (వీడియో)
- లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు
- గ్రామంలోనే వారిని బంధించిన ప్రజలు
- సమాచారం అందుకున్న సమీప స్టేషన్ల పోలీసులు
- గ్రామానికి చేరుకున్న మూడు స్టేషన్ల సిబ్బంది
- గ్రామస్థులను బజ్జగించి వారిని రక్షించి వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో దోపిడీ ఆరోపణలపై గ్రామస్థులు ఇద్దరు ఇన్స్పెక్టర్లను బందీలుగా పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు గ్రామానికి వెళ్లారని, అక్కడ ఓ యువకుడిని చెప్పుతో కొట్టారని గ్రామస్థులు తెలిపారు. ఆ తర్వాత వారిని గ్రామస్థులు నిలదీయడంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో ప్రజలు ఇద్దరినీ బందీలుగా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు పోలీస్ స్టేషన్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాగోలా ఇద్దరినీ రక్షించారు. ఈ సందర్భంగా దాదాపు గంటల తరబడి గొడవ కొనసాగింది. వీరి వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
READ MORE: Yogi Adhityanath: సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు
Also Read
ఈ ఘటన మీరట్లోని పరీక్షిత్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. శనివారం రాత్రి ఇద్దరు ఇన్స్పెక్టర్లు గోవింద్పురి గ్రామానికి చేరుకుని యువకులు అక్రమంగా పటాకులు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరూ ఆ వ్యాపారిని డబ్బులు (లంచం) అడిగారు. ఈ సమయంలో వారిద్దరూ యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఓ ఇన్స్పెక్టర్ యువకుడిని కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న మరికొందరు ఆగ్రహానికి గురై ఇద్దరినీ బందీలుగా పట్టుకున్నారు.
READ MORE: J-K: జమ్మూకశ్మీర్లో మరో ఉగ్రదాడి..
ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సత్యేంద్ర, అండర్ ట్రైనీ శివమ్గా గుర్తించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లను బందీలుగా పట్టుకోవడం గురించి కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. మూడు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చి వారిని విడిపించారు.ఇద్దరు ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చి గ్రామస్థులను శాంతింపజేశారు. ఇన్స్పెక్టర్లిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, తమ పిస్టల్ని అక్కడ చూపించేందుకు ప్రయత్నించారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#मेरठ में पटाखों की बिक्री को लेकर दो दरोगा, सतेंद्र और शिवम, पर अवैध वसूली का आरोप लगा है। जब ग्रामीणों ने पैसे देने से मना किया, तो आरोप है कि दरोगाओं ने एक घर में घुसकर एक बुजुर्ग महिला और एक युवक के साथ मारपीट की।
इस घटना से गुस्साए ग्रामीणों ने दोनों दरोगाओं को बंधक बना… pic.twitter.com/wJpFLxhwyR— UttarPradesh.ORG News (@WeUttarPradesh) November 3, 2024
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!