Heavy Rains in Krishna District: కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు.. తెలంగాణకు నిలిచిన రాకపోకలు
- ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ వర్షాలు..
- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, నదులు..
- పెనుగంచిప్రోలు నుండి తెలంగాణ మధిరకు రాకపోకలు బంద్..
- పలు ప్రాంతాల్లో గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains in Krishna District: వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. ఒడిశా తీరాన్ని అనుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేస్తోంది.. అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా విస్తరించింది రుతుపవన ద్రోణి… దీని ప్రభావంతో.. రాగాల ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ.. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ వర్షాల ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. జగ్గయ్యపేటలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలో వరి, పత్తి, పొలాలు నీట మునిగాయి. కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో పెనుగంచిప్రోలు నుండి తెలంగాణ మధిరకు రాకపోకలు నిలిచాయి.
Read Also: Kattaleru Vagu: కట్టలేరు వాగుకు మళ్లీ పోటెత్తిన వరద.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్..!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం వద్ద నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈరోజు ఉదయం ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. నల్లవాగు ఉధృతంగా ప్రవహించడంతో నందిగామ – చందర్లపాడు మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక, మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు వద్ద ఏనుగు గడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో చిలుకూరు, దాములూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏనుగు గడ్డ వాగుకు పై ప్రాంతాల నుండి నీరు అధికంగా వస్తుండటంతో చిలుకూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నంకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Building Collapse: మహారాష్ట్రలో భవనం కూలి 15 మంది మృతి, బిల్డర్ అరెస్ట్
అవనిగడ్డలో హంసలదీవి బీచ్ గేట్లు మూసేసారు. ఎడ్లంక గ్రామాన్ని నేడు సెంట్రల్ వాటర్ కమిషన్ సందర్శించనుంది. కృష్ణా వరదల ఉధృతికి ప్రమాదకర స్థాయిలో ఎడ్లంక గ్రామం కోతకు గురవుతోంది. ఎడ్లంక గ్రామ కోతపై హోమ్ మంత్రి అనితను, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ ప్రకాశ్ జైన్ ను కలసి సమస్యను స్థానిక తెలుగుదేశం నేత బొబ్బా గోవర్ధన్ వివరించారు. తక్షణం స్పందించిన హోమ్ మంత్రి నివేదిక గ్రామంలో పరిస్థితుల అధ్యయనంను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. కోత నివారణపై అధ్యయనం చేసేందుకు ఈ సాయంత్రం ఎడ్లంకకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు రానున్నారు. మరోవైపు నూజివీడులో అకాల వర్షానికి ప్రధాన ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టిందని మంత్రి పార్థసారథి తెలిపారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!