Building Collapse: మహారాష్ట్రలో భవనం కూలి 15 మంది మృతి, బిల్డర్ అరెస్ట్
- మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం..
- విరార్ ప్రాంతంలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..
- ప్రమాదంలో 15 మంది, పలువురుకి తీవ్ర గాయాలు..
Building Collapse: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో సుమారు 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక, విరార్లోని నారంగి ఫాటా దగ్గర ఉన్న రాము కాంపౌండ్లోని రమాబాయి అపార్ట్మెంట్ భవనం 4వ అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలింది.. ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఒక చిన్న ఇళ్ల సముదాయంపై పడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన ప్రదేశానికి చేరుకున్నాయి.
Read Also: Rajasthan: రాజస్థాన్లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ఇక, రాత్రంతా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు 20 గంటలుగా తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకు రాగా.. గాయపడిన వారిని విరార్, నలసోపారాలోని ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు.
Read Also: Mizoram: రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
అయితే, సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని ‘అత్యంత ప్రమాదకరమైనది’గా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలోనే గుర్తించి నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. శిథిలాల కింద ఇంకా 10 నుంచి 11 మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ భవనాన్ని నిర్మించిన బిల్డర్ నితల్ గోపీనాథ్ సానేను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రాంతీయ పట్టణ ప్రణాళిక చట్టం (MRTP) సెక్షన్లు 52, 53, 54తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసులు పెట్టారు పోలీసులు.
తాజావార్తలు
-
MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
-
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!