Building Collapse: మహారాష్ట్రలో భవనం కూలి 15 మంది మృతి, బిల్డర్ అరెస్ట్
- మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం..
- విరార్ ప్రాంతంలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..
- ప్రమాదంలో 15 మంది, పలువురుకి తీవ్ర గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Building Collapse: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో సుమారు 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక, విరార్లోని నారంగి ఫాటా దగ్గర ఉన్న రాము కాంపౌండ్లోని రమాబాయి అపార్ట్మెంట్ భవనం 4వ అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలింది.. ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఒక చిన్న ఇళ్ల సముదాయంపై పడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన ప్రదేశానికి చేరుకున్నాయి.
Read Also: Rajasthan: రాజస్థాన్లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ఇక, రాత్రంతా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు 20 గంటలుగా తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకు రాగా.. గాయపడిన వారిని విరార్, నలసోపారాలోని ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు.
Read Also: Mizoram: రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
అయితే, సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని ‘అత్యంత ప్రమాదకరమైనది’గా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలోనే గుర్తించి నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. శిథిలాల కింద ఇంకా 10 నుంచి 11 మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ భవనాన్ని నిర్మించిన బిల్డర్ నితల్ గోపీనాథ్ సానేను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రాంతీయ పట్టణ ప్రణాళిక చట్టం (MRTP) సెక్షన్లు 52, 53, 54తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసులు పెట్టారు పోలీసులు.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?