Manohar Lal Khattar: ఢిల్లీకి సాయం చేస్తా.. సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తించడం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీకి తాము పూర్తి సాయం చేస్తామని అన్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉన్నాయని హర్యానా సీఎం ఆరోపించారు. హర్యానా నుంచి అందుతున్న నీటికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెల్లించలేదన్నారు. ఢిల్లీ ప్రజలతో తాము ఉన్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ విదూషకులలా మాట్లాడటం సరికాదన్నారు ఆయన.
Suriya: రియల్ లైఫ్ లో రోలెక్స్ స్టార్ హీరోనే…
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మరోవైపు కేజ్రీవాల్ ప్రభుత్వంపై.. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వరద నియంత్రణ ఆదేశాల మేరకు జరగాల్సిన సమావేశాన్ని గత రెండేళ్లుగా ఎందుకు నిర్వహించలేదో కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు చెప్పాలని అన్నారు. వరదలకు సంబంధించి ప్రభుత్వం ముందుగా ఎందుకు ప్రణాళిక రూపొందించలేదని ప్రశ్నించారు. మరోవైపు హర్యానా నుండి తక్కువ నీటిని విడుదల చేసినప్పుడు, ఢిల్లీ ఎలా ముంపునకు గురైందని కేజ్రీవాల్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. యమునా శుద్దీకరణ పేరుతో 6800 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు.
IND W vs BAN W: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా వరుసగా రెండోసారి ఓటమి..
ఢిల్లీలో భారీ వరదలకు కేంద్ర ప్రభుత్వం, హర్యానా సర్కారు చేసిన కుట్రే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయడం వల్లే యమునా నది నీటిమట్టం పెరిగి ఢిల్లీ వీధుల్లోకి నీళ్లు వచ్చాయని కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు మండిపడ్డారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!