Shraddha Walker Case: శ్రద్ధ హత్య కేసులో మరో ట్విస్ట్.. ముక్కలు చేసి చంపేస్తాడని 2020లోనే ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walker Case: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులో రోజుకొక విషయం వెలుగుచూస్తోంది. శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు. మరోవైపు, తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని శ్రద్ధ ముందుగానే ఊహించింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలో రెండేళ్ల క్రితమే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు ఆమెను అఫ్తాబ్ కొట్టాడు. ఆమెకు ఊపిరాడకుండా చేసి, హత్య చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో ఆమె మహారాష్ట్రలోని వసాయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2020లో శ్రద్ధా వాకర్ ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తనను చంపి ముక్కలుగా నరికివేస్తానని బెదిరించాడని అందులో పేర్కొంది. మహారాష్ట్రలోని పాల్ఘర్లోని తులిన్జ్ పోలీస్ స్టేషన్లో హత్య కేసులో ప్రధాన నిందితుడైన తన ప్రియుడు తనపై దాడి చేసి చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదు చేసింది.
ఈ ఏడాది మేలో శ్రద్ధా (27)ని ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా గొంతు కోసి హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అఫ్తాబ్ ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, తరిగిన భాగాలను ఫ్రిజ్లో భద్రపరిచి, ఆపై వాటిని చాలా రోజుల పాటు దేశ రాజధాని సమీపంలో అటవీప్రాంతంలో పడేశాడు. ఈ జంట 2019లో డేటింగ్ యాప్లో కలుసుకున్నారు. ముంబైలో నుంచి దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్కు ఒక ఇంటిలో కలిసి ఉన్నారు. 2020లో తులింజ్ పోలీస్ స్టేషన్లో శ్రద్ధ ఫిర్యాదు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు ధృవీకరించారు.
Also Read
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
Jerusalem Blasts: జంట పేలుళ్లతో వణికిన ఇజ్రాయిల్.. జెరూసలేంపై మిలిటెంట్ల దాడి..
నవంబర్ 23, 2020 నాటి తన ఫిర్యాదు లేఖలో శ్రద్ధా ఇలా రాసింది. “ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా నన్ను దుర్భాషలాడుతూ కొట్టాడు, ఈ రోజు అతను నన్ను ఊపిరాడకుండా చంపడానికి ప్రయత్నించాడు. అతను నన్ను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ముక్కలుగా నరికి పారేస్తానని బెదిరించాడు. అతడు నన్ను చంపేస్తాడని బెదిరించడంతో పోలీసుల వద్దకు వెళ్లే ధైర్యం నాకు లేదు.” అని శ్రద్ధ లేఖలో పేర్కొంది. అఫ్తాబ్ తనను కొట్టేవాడని, చంపేందుకు ప్రయత్నించాడని అతడి కుటుంబసభ్యులకు తెలిసిందని శ్రద్ధా లేఖలో పేర్కొంది. అతడి కుటుంబసభ్యులు ఉన్నారనే ధైర్యంతో తనతో ఉన్నానని.. కానీ వారికి తెలిసే తనను బాధపెట్టినట్లు ఆమె లేఖలో తెలిపింది. తనతో కలిసి ఉండాలని లేదని కూడా ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయినప్పటికీ… మళ్లీ అతనితోనే ఆమె ఎందుకు ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
-
PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!