Jerusalem Blasts: జంట పేలుళ్లతో వణికిన ఇజ్రాయిల్.. జెరూసలేంపై మిలిటెంట్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twin blasts at bus stops shake Jerusalem, over 15 injured: ఇజ్రాయిల్ జంట పేలుళ్లతో వణికింది. జెరూసలేంలోని బస్ స్టాపులే టార్గెట్గా వరసగా రెండు పేలుళ్లు జరిగాాయి. నగరం శివారులో ఉన్న బస్ స్టాండ్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో 15 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. పాలస్తీనా మిలిటెంట్లు ఈ దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో అత్యవసర సేవలను మోహరించారు. సిటీ వెస్ట్రన్ ఎగ్జిట్ సమీపంలోని బస్ స్టేషన్ లో మొదటి పేలుడు సంభవించగా.. రెండవది నగరానికి తూర్పున ఉన్న బస్ స్టేషన్ లో జరిగింది. దాదాపుగా 30 నిమిషాల వ్యవధిలో ఈ రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
Read Also: Orion Spacecraft: చంద్రుడికి చేరువలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్..
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
వెస్ట్రన్ ఎగ్జిట్ వద్ద జరిగిన పేలుడులో మొత్తం 12 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఒకరు మరణించారు. మరో చోట జరిగిన పేలుడులో బస్సు దెబ్బతింది, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సాక్ష్యాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. ఘటనపై రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ షిన్ బెట్, అంతర్గత భద్రతాధికారులతో సమావేశం అయ్యారు. వీటిని తీవ్రవాద దాడులుగా అక్కడి మంత్రులు అభివర్ణిస్తున్నారు.
ఇజ్రాయిల్, పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పాలస్తీనా మిలిటెంట్లు తరుచుగా ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నారు. దీంతో ఇజ్రాయిల్ ఆర్మీ గాజా స్ట్రీప్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థావరాలను రాకెట్లతో ధ్వంసం చేస్తోంది. 2000 నుంచి ఈ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం గాజా స్ట్రీప్ హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఉంది. తాజాగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రతినిధి బాంబు దాడులను ప్రశంసించారు. అయితే వీటికి మాత్రం బాధ్యత వహించలేదు. ఇక జెరూసలెం విషయానికి వస్తే ఇక్కడి టెంపుల్ మౌంట్ ప్రాంతంలో తరుచుగా యూదులు, ముస్లింలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని జెంజమిన్ నెతన్యాహు మళ్లీ గెలుపొందారు. ప్రస్తుతం ఈయన తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్న క్రమంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!