Jerusalem Blasts: జంట పేలుళ్లతో వణికిన ఇజ్రాయిల్.. జెరూసలేంపై మిలిటెంట్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twin blasts at bus stops shake Jerusalem, over 15 injured: ఇజ్రాయిల్ జంట పేలుళ్లతో వణికింది. జెరూసలేంలోని బస్ స్టాపులే టార్గెట్గా వరసగా రెండు పేలుళ్లు జరిగాాయి. నగరం శివారులో ఉన్న బస్ స్టాండ్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో 15 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. పాలస్తీనా మిలిటెంట్లు ఈ దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో అత్యవసర సేవలను మోహరించారు. సిటీ వెస్ట్రన్ ఎగ్జిట్ సమీపంలోని బస్ స్టేషన్ లో మొదటి పేలుడు సంభవించగా.. రెండవది నగరానికి తూర్పున ఉన్న బస్ స్టేషన్ లో జరిగింది. దాదాపుగా 30 నిమిషాల వ్యవధిలో ఈ రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
Read Also: Orion Spacecraft: చంద్రుడికి చేరువలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్..
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
వెస్ట్రన్ ఎగ్జిట్ వద్ద జరిగిన పేలుడులో మొత్తం 12 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఒకరు మరణించారు. మరో చోట జరిగిన పేలుడులో బస్సు దెబ్బతింది, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సాక్ష్యాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. ఘటనపై రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ షిన్ బెట్, అంతర్గత భద్రతాధికారులతో సమావేశం అయ్యారు. వీటిని తీవ్రవాద దాడులుగా అక్కడి మంత్రులు అభివర్ణిస్తున్నారు.
ఇజ్రాయిల్, పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పాలస్తీనా మిలిటెంట్లు తరుచుగా ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నారు. దీంతో ఇజ్రాయిల్ ఆర్మీ గాజా స్ట్రీప్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థావరాలను రాకెట్లతో ధ్వంసం చేస్తోంది. 2000 నుంచి ఈ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం గాజా స్ట్రీప్ హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఉంది. తాజాగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రతినిధి బాంబు దాడులను ప్రశంసించారు. అయితే వీటికి మాత్రం బాధ్యత వహించలేదు. ఇక జెరూసలెం విషయానికి వస్తే ఇక్కడి టెంపుల్ మౌంట్ ప్రాంతంలో తరుచుగా యూదులు, ముస్లింలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని జెంజమిన్ నెతన్యాహు మళ్లీ గెలుపొందారు. ప్రస్తుతం ఈయన తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్న క్రమంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!