Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఘాటు విమర్శలు
- గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి
- కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత
- రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన ప్రాంతంగా ఉండేదని, కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత గజ్వేల్ అభివృద్ధి, ప్రేమ, అభిమానాలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందజేసిన ఘనత కూడా కేసీఆర్దేనని హరీష్ రావు చెప్పారు.
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ భగీరథ ప్రాజెక్టుపై కోత విధించిందని హరీష్ రావు మండిపడ్డారు. ఒకప్పుడు మొదటి అంతస్తులకు సైతం నీరు అందుతుండగా, ఇప్పుడు కనీస నీరుకూడా అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించారని, గోదావరి జలాలతో గజ్వేల్ లో రైతులు సస్యశ్యామలం అవుతున్నారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో భూముల ధరలు పడిపోతున్నాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
గజ్వేల్ను విద్యా హబ్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని, పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచారని హరీష్ రావు వివరించారు. కేసీఆర్ మంజూరు చేసిన రూ.181 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి రద్దు చేయడం బాధాకరమని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ గజ్వేల్ అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ గురించి ఏడ్చిన రేవంత్, సీఎం అయిన తరువాత కూడా అదే ఏడుపు కొనసాగించడం దారుణమని వ్యాఖ్యానించారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ప్రాజెక్టుల వల్లే మల్లన్నసాగర్ గేట్లు తెరుచుకున్నాయని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన కృషిని ప్రజలు మరవలేరని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Women Playing Poker: పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ ఆరుగురు మహిళలు..
- Tags
- BRS
- congress
- gajwel
- harish rao
- kcr
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!