Harish Rao: గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది..
- బీర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్
- రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు- హరీష్ రావు
- గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది- హరీష్ రావు
- ఆగమయ్యాం అని తనకు సర్పంచ్లు వినతిపత్రం ఇస్తున్నారు- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, బీర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదని అన్నారు. గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్లు ఆగమయ్యాం అని తనకు వినతిపత్రం ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం తట్టిలేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోయట్లేదని అన్నారు.
Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఉపాధి హామీ నిధులు కేంద్రం రూ. 850 కోట్లు నిధులు విడుదల చేసింది.. రూ. 350 కోట్ల గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వాలి.. అవి విడుదల చేయడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. చాలా చోట్ల బిల్లులు రాలేదని స్కూళ్లలో బాత్రూంలు ఓపెన్ చేయట్లేదని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడంతో చాలా నిధులు ఆగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యపై అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని.. తాను లేవగానే 8 మంది మంత్రులు లేచి అడ్డుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. రైతు రుణమాఫీపై రేషన్ కార్డు నిబంధనలు లేదు అన్నారు.. కానీ జీవో ఇవ్వలేదని హరీష్ రావు పేర్కొన్నారు. దీనితో రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ జరగలేదని తెలిపారు. PMKSY, రేషన్ కార్డు నిబంధనల వల్ల నలభై శాతం వారికి రుణమాఫీ అవ్వట్లేదని అన్నారు.
Michael Vaughan: విరాట్, కేన్ వల్ల కాదు.. సచిన్ టెస్టు స్కోరును అధిగమించేది అతడే!
అసెంబ్లీ ముందు నాలుగు వరుసల కంచెలు వచ్చాయి.. గతంలో జీఎచ్ఎంసీ కార్పొరేటర్కు నెలకు నలభై లక్షల ఫండ్స్ ఇచ్చే వాళ్ళమన్నారు. ఇప్పుడు ఒక్క పైసా కార్పొరేటర్ ఇవ్వట్లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీహార్ ఆఫీసర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని గగ్గోలు పెట్టారు.. మరి ఇప్పుడు తెలంగాణ నుంచి ఉన్న సీవీ ఆనంద్, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, శివదర్ రెడ్డిలకు అర్హత ఉన్నా వాళ్ళను ఎందుకు డీజీపీ చేయలేదని ప్రశ్నించారు. గతంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చే..సి ఇప్పుడు అందలం ఎక్కించారని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. దివ్యాంగులు ఐఏఎస్లుగా పనికిరారు అనే స్మిత సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదన్నారు హరీష్ రావు. ఇకపోతే.. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అయ్యే విషయంలో తమకు ఒక స్ట్రాటజీ ఉంది.. హాజరు అవుతారో లేదో ఇప్పుడే చెప్పమని హరీష్ రావు చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?