Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పూర్తిగా త్యాగం చేశారని, కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని, కనీసం ‘జై తెలంగాణ’ అని అనని వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా నీళ్ల కోసమే వచ్చిందని గుర్తుచేసిన హరీశ్ రావు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయిందని దుయ్యబట్టారు. గతంలో 18 సార్లు జీఆర్ఎంబీ (GRMB) సమావేశాలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించినా, ఆనాడు తెలంగాణ ప్రభుత్వం వాటిని తిప్పికొట్టి అన్ని అనుమతులు సాధించిందన్నారు. కానీ నేడు చరిత్రలో తొలిసారిగా గతంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను కూడా రద్దు చేసి, రివ్యూ చేయాలనే అంశాన్ని జీఆర్ఎంబీ అజెండాలో చేర్చడం శోచనీయమన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీళ్లపై కనీస సోయి లేదని, ఇప్పటికైనా కళ్లు తెరిచి జీఆర్ఎంబీ అజెండాను మార్పించాలని, ప్రభుత్వం వద్ద చిత్తశుద్ధి ఉంటే ఆ సమావేశాన్ని తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read
- India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- 40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందో స్పష్టం చేయాలన్నారు. సమ్మక్క సారక్క (దేవాదుల) ప్రాజెక్టుకు 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం దానిని ఎందుకు వదులుకుంటోందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా వరంగల్, నల్గొండ జిల్లాలకు నీరందించే ఈ ప్రాజెక్టును వదులుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. మొదట అజెండాలో లేదన్నారని, ఆ తర్వాత ఢిల్లీ మీటింగ్లో చేర్చారని, సమావేశానికి హాజరుకామని చెప్పి వెళ్లి సంతకాలు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వం కోర్టులలో వేసిన పిటిషన్ల నిర్వహణ రాక అట్టర్ ఫ్లాప్ అయిందని, కనీసం రిట్ పిటిషన్ వేయడం కూడా ఈ ప్రభుత్వానికి రావడం లేదని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!