Harish Rao : స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం.. హరీష్ రావు ఫైర్..
- డిగ్రీ స్టూడెంట్లతో ఆడుకుంటున్నారు
- ఇప్పటికీ ఎగ్జామ్స్ నిర్వహించలేదు
- హరీష్ రావు ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. డిగ్రీ స్టూడెంట్లకు ఇంకా ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్లు దోచిపెట్టారని.. కానీ స్టూడెంట్లకు మాత్రం ఫీజు రీయంబర్స్ మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. డిగ్రీ స్టూడెంట్లకు రూ.800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా 6 లక్షల మంది స్టూడెంట్ల జీవితాలను అగమ్య గోచరంగా మార్చేసిందన్నారు.
Read Also : Vijay Sethupathi : ‘తలైవన్ తలైవి’ టైటిల్ టీజర్ రిలీజ్..!
‘డిగ్రీ ఎగ్జామ్స్ టైమ్ కు నిర్వహించకపోవడంతో.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లా సెట్, పీజీసెట్, ఇతర సెట్ ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. ఏప్రిల్ లోనే ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల స్టూడెంట్లు, యాజమాన్యాలు తీవ్రమైన నిరసన తెలుపుతున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు. బీఆర్ ఎస్ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రీయంబర్స్ మెంట్ ఆపలేదు.
Also Read
కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే స్టూడెంట్లను ఇబ్బందుల్లో పడేసింది. డిగ్రీ అడ్మిషన్లు నిలిపేసి కాలేజీలకు తాళం వేసే పరిస్థితి తీసుకొచ్చింది. 17 నెలల్లో 17 పైసలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా.. స్టూడెంట్ల జీవితాలకు అతీగతీ లేకుండా పోతోంది. మొన్న అసెంబ్లీలో ఫీజు రీయంబర్స్ మెంట్లు త్వరలోనే ఇస్తామని రేవంత్ ప్రకటించినా.. ఇప్పటికీ అమలు కావట్లేదు. పాలన చేతకాక విద్యార్థులతో ఆడుకుంటే ఊరుకునేది లేదు’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు హరీష్ రావు.
Read Also : Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !
బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించరా?
కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నది.
డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ. 800 కోట్ల ఫీజు… pic.twitter.com/LRz0d0ppA6
— Harish Rao Thanneeru (@BRSHarish) May 4, 2025
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..