Gudivada Amarnath: ఋషికొండ కట్టడాలపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి
- ఋషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం.. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్న మాజీ మంత్రి
- రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశాం.. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించామన్న గుడివాడ టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద.. వారి కుటంబం మీద బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్న
Gudivada Amarnath: ఋషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అవి వైఎస్ జగన్ సొంత భవనాల్లాగా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. రుషికొండ భావనలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని కోరారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం.. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భావనలను వినియోగించుకోవాలని సూచించారు.. రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ మోహన్ రెడ్డి ఏమీ ఉండరు అని వ్యాఖ్యానించారు.
Read Also: Home Minister Anitha: లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఇక, విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు.. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారని తెలిపారు అమర్నాథ్.. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటంబం మీద బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసం? అని మండిపడ్డారు..2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. హైదారాబాద్ లో ఇల్లు నిర్మించుకునే సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్ ఉండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండ పై శాశ్వత భవనాలు నిర్మించారని తెలిపారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలని సవాల్ చేశారు.. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవుపలికారు.
Read Also: Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
రుషికొండ పై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలని కోరారు గుడివాడ అమర్నాథ్.. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేదన్న ఆయన.. గతంలో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి చదరపు అడుగుకు 10 వేలు ఖర్చు పెట్టగా లేని అభ్యంతరం ఈ భావనాలకు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్లో స్టార్ హోటల్ లో ఉంటూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది మర్చిపోయారా? అని నిలదీశారు. విశాఖ రాజధానిని స్వాగతించిన గంటాకు నగరంలో ఒక్క ప్రభుత్వ అతిధి గృహం కూడా లేదన్న విషయం తెలియదా? స్థానిక శాసనసభ్యుడిగా రుషికొండ ఎదురుగా 25 ఎకరాలు ఆక్రమించుకున్న గీతం యూనివర్సిటీకి గంటా ఎందుకు తీసుకెళ్లలేదు.. ప్రభుత్వంపై ఆరునెలలు విమర్శలు చేయకూడదని అనుకున్నా టీడీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక, కోడెల శివప్రసాద్ సామాగ్రి తరలింపునకు, మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయ సామాగ్రికి పోలికే లేదన్నారు. ముఖ్యమంత్రిగా నివాసం ఉన్నారు కాబట్టి ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, ఫర్నిచర్ కు డబ్బులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖ రాశాం అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో