JIO 5G: జియో వినియోగదారులకు శుభవార్త.. తెలంగాణలోని 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JIO 5G: జియో వినియోగదారులకు శుభవార్త అందించింది ఆ సంస్థ. ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల జియో ట్రూ 5జీ సేవలు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో అందించేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 850కిపైగా ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఈ లాంచ్ జియో వినియోగదారులకు ఉత్తమమైన ట్రూ 5G అనుభవాన్ని అందింస్తుందని రిలయన్స్ జియో తెలుపుతుంది.
Read Also: CM Jagan: వట్టిచెరుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఇక Jio True 5G సేవలు అన్ని ప్రాంతాల్లోని వినియోగదారులకు 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. అంతేకాకుండా జియో వెల్కమ్ ఆఫర్ ద్వారా పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. జియో ట్రూ 5G నెట్వర్క్ ముఖ్యమైన ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, విద్యా సంస్థలు, మాల్స్, మార్కెట్లు, నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్యమైన వాణిజ్య సంస్థలను కవర్ చేస్తుంది. వాటితో పాటు అదనంగా ఈ 850 ప్రాంతాలకు ఆనుకుని ఉన్న అనేక పట్టణాలు, గ్రామాలు కూడా జియో ట్రూ 5జీ కనెక్టివిటీ నుంచి ప్రయోజనం పొందనున్నారు.
Read Also: LIC New Policy: ఎల్ఐసీ లో సూపర్ పాలసీ.. పురుషులు కోసమే.. బెనిఫిట్స్ ఇవే..
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాలు, 850కి పైగా ప్రధాన ప్రదేశాలలో జియో ట్రూ 5G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినందుకు సంతోషిస్తున్నామని నెట్వర్క్ విస్తరణ జియో ప్రతినిధి అన్నారు. 2023 డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణాలు, తాలూకాలో ట్రూ 5G సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దేశవ్యాప్త విస్తరణ జియో ట్రూ 5G నెట్వర్క్ అసమానమైన సామర్థ్యాలతో వినియోగదారులను శక్తివంతం చేస్తుంది. తద్వారా వారు పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తుంది. అధునాతన సాంకేతికత జియో ట్రూ 5G మూడు రెట్లు ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశంలోని ఏకైక ట్రూ 5G నెట్వర్క్గా ఉందని అన్నారు. ముందుగా ఇది 4G నెట్వర్క్పై ఆధారపడకుండా 5జీ నెట్వర్క్ అందుకోవచ్చన్నారు. జియో ట్రూ 5జీ సేవలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శర వేగంగా విస్తరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!