JIO 5G: జియో వినియోగదారులకు శుభవార్త అందించింది ఆ సంస్థ. ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల జియో ట్రూ 5జీ సేవలు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో అందించేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 850కిపైగా ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఈ లాంచ్ జియో వినియోగదారులకు ఉత్తమమైన ట్రూ 5G అనుభవాన్ని అందింస్తుందని రిలయన్స్ జియో తెలుపుతుంది.
Read Also: CM Jagan: వట్టిచెరుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
ఇక Jio True 5G సేవలు అన్ని ప్రాంతాల్లోని వినియోగదారులకు 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. అంతేకాకుండా జియో వెల్కమ్ ఆఫర్ ద్వారా పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. జియో ట్రూ 5G నెట్వర్క్ ముఖ్యమైన ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, విద్యా సంస్థలు, మాల్స్, మార్కెట్లు, నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్యమైన వాణిజ్య సంస్థలను కవర్ చేస్తుంది. వాటితో పాటు అదనంగా ఈ 850 ప్రాంతాలకు ఆనుకుని ఉన్న అనేక పట్టణాలు, గ్రామాలు కూడా జియో ట్రూ 5జీ కనెక్టివిటీ నుంచి ప్రయోజనం పొందనున్నారు.
Read Also: LIC New Policy: ఎల్ఐసీ లో సూపర్ పాలసీ.. పురుషులు కోసమే.. బెనిఫిట్స్ ఇవే..
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాలు, 850కి పైగా ప్రధాన ప్రదేశాలలో జియో ట్రూ 5G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినందుకు సంతోషిస్తున్నామని నెట్వర్క్ విస్తరణ జియో ప్రతినిధి అన్నారు. 2023 డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణాలు, తాలూకాలో ట్రూ 5G సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దేశవ్యాప్త విస్తరణ జియో ట్రూ 5G నెట్వర్క్ అసమానమైన సామర్థ్యాలతో వినియోగదారులను శక్తివంతం చేస్తుంది. తద్వారా వారు పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తుంది. అధునాతన సాంకేతికత జియో ట్రూ 5G మూడు రెట్లు ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశంలోని ఏకైక ట్రూ 5G నెట్వర్క్గా ఉందని అన్నారు. ముందుగా ఇది 4G నెట్వర్క్పై ఆధారపడకుండా 5జీ నెట్వర్క్ అందుకోవచ్చన్నారు. జియో ట్రూ 5జీ సేవలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శర వేగంగా విస్తరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.