CM Jagan: వట్టిచెరుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Responds On Vatticherukuru Tractor Incident: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు రూ. 1 లక్ష ఆర్ధిక సాయం.. అలాగే స్వల్పంగా గాయపడిన వారికి వైద్యచికిత్సలతో పాటు రూ. 25 వేల సాయం అందించాలని ఆదేశాలను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
LIC New Policy: ఎల్ఐసీ లో సూపర్ పాలసీ.. పురుషులు కోసమే.. బెనిఫిట్స్ ఇవే..
Also Read
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
ఇదిలావుండగా.. వట్టిచెరుకూరు సమీపంలో ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో.. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ట్రాక్టర్లో సుమారు 40 మంది ఓ శుభకార్యం కోసం బయలుదేరారు. కొండేపాడు నుంచి జూపూడికి వెళ్తున్న సమయంలో.. అనుకోకుండా ఇది అదుపు తప్పింది, ఈ ప్రమాదం జరిగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వెంటనే దగ్గరలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతిచెందిన వారు ప్రత్తిపాడు మండలం కొండపాడుకు చెందిన వారిగా గుర్తించారు.
Nadendla Manohar: జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తారు
ఈ ఘటనపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ట్రాక్టర్ బోల్తా దుర్ఘటన దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం పాలవడం తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శుభకార్యానికి వెళ్తున్న బృందం ప్రమాదం బారిన పడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!