CM Jagan: వట్టిచెరుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Responds On Vatticherukuru Tractor Incident: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు రూ. 1 లక్ష ఆర్ధిక సాయం.. అలాగే స్వల్పంగా గాయపడిన వారికి వైద్యచికిత్సలతో పాటు రూ. 25 వేల సాయం అందించాలని ఆదేశాలను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
LIC New Policy: ఎల్ఐసీ లో సూపర్ పాలసీ.. పురుషులు కోసమే.. బెనిఫిట్స్ ఇవే..
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ఇదిలావుండగా.. వట్టిచెరుకూరు సమీపంలో ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో.. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ట్రాక్టర్లో సుమారు 40 మంది ఓ శుభకార్యం కోసం బయలుదేరారు. కొండేపాడు నుంచి జూపూడికి వెళ్తున్న సమయంలో.. అనుకోకుండా ఇది అదుపు తప్పింది, ఈ ప్రమాదం జరిగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వెంటనే దగ్గరలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతిచెందిన వారు ప్రత్తిపాడు మండలం కొండపాడుకు చెందిన వారిగా గుర్తించారు.
Nadendla Manohar: జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తారు
ఈ ఘటనపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ట్రాక్టర్ బోల్తా దుర్ఘటన దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం పాలవడం తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శుభకార్యానికి వెళ్తున్న బృందం ప్రమాదం బారిన పడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..