Ganta Srinivasa Rao: ఎన్ని కుప్పిగంతులువేసినా వారికి రాష్ట్రంతో రుణం తీరిపోయింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganta Srinivasa Rao: ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్రంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణం తీరిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేవారు మాజీ మంత్రి, టీడీసీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు.. YSRCP ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయి.. నోటిఫికేషన్ కొద్ది రోజులు ముందు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఒక డ్రామాగా కొట్టిపారేశారు. విశాఖ ప్రజలు జగన్, వైసీపీని నమ్మడం లేదని 2014, 2019, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయమే నిదర్శనంగా పేర్కొన్న ఆయన.. బస్ బే, ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేయలేని ప్రభుత్వం.. రాజధాని ఎలా నిర్మించ గలదో చెప్పాలని డిమాండ్ చేశారు..
విశాఖలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 హెలిప్యాడ్ నిర్మాణం తప్ప అదనంగా వచ్చిన ఒక్క ప్రాజెక్ట్ లేదు అని దుయ్యబట్టారు గంటా.. ఎన్ని కుప్పగంతులు వేసినా రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డికి రుణం తీరిపోయిందన్న ఆయన.. జగన్మోహన్ రెడ్డి గెలిచి ప్రమాణ స్వీకారం, వైజాగ్ లో నివాసం.. ఈ రెండు జరిగే పనులు కాదన్నారు. సెక్రెటరీయెట్ తాకట్టుతోనే జగన్ ప్రభుత్వంపై విశ్వసనీయత పోయింది.. తాకట్టు పెడితే తప్పు లేదని మంత్రులు సమర్థిస్తున్నారు. వేటిని తాకట్టు పెట్టాలో కూడా విజ్ఞత వుండాలి కదా..? అని ప్రశ్నించారు. విశాఖలో డ్రీమ్ కేపిటల్ అంటున్న సీఎం జగన్ బూటకపు మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు, భూములను తాకట్టు పెట్టిన ప్రభుత్వం.. అభివృద్ధి ఎలా సాధ్యం చేస్తారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో వచ్చిన పెట్టుబడులపై చర్చించాలని డిమాండ్ చేవారు గంటా శ్రీనివాసరావు.
Also Read
- Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
- Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
మరోవైపు.. మంత్రి బొత్సపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు గంటా.. చీపురుపల్లిలో తనపై పోటీ అంటే ఓడిపోవడానికి అన్న బొత్స వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన ఆయన.. ఓడిపోయిన అనుభవం బొత్సకే వుంది.. ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా బొత్స ఓడిపోయారని గుర్తుచేశారు. నేను గెలవడం తప్ప ఓడిపోవడం తెలియదు. సీట్లు ఫిక్స్ అయిన తర్వాత ఎవరు ఎక్కడ నుంచి పోటీ అనేది తేలుతుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
-
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
-
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
-
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
-
CM Revanth Reddy : హైదరాబాద్లో AI దూకుడు.. రూ.70 వేల కోట్ల మెగా డీల్..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!