G7- India: గోధుమల ఎగుమతులను నిలిపేస్తే సంక్షోభం తీవ్రం అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దేశీయంగా ధరలు పెరడటంతో ధరలను కంట్రోల్ చేసే ఉద్దేశంతో విదేశాలకు గోధమ ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఇండియాలో ఆహర భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు చేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చింది.
కాగా ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీ 7 దేశాలు భారత నిర్ణయాన్ని ఖండించాయి. ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు. ప్రతి ఒక్కరు ఎగుమతులపై పరిమితులు విధించడం… మార్కెట్లను మూసివేయడం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జీ20లో సభ్యుడిగా ఉన్న భారత్ తన బాధ్యతలను నిర్వహించాలని కోరుతున్నామని ఓజ్డెమిర్ అన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆహార సరఫరా అంతరాయానికి రష్యా కారణం అంటూ జర్మనీ ఛాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. ఆహార కొరతకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ప్రపంచంలో చైనా తరువాత అతిపెద్ద గోధుమల ఉత్పత్తిదారుగా భారత్ రెండో స్థానంలో ఉంది. దీంతో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో గోధుమలు దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇండియా తరువాత రష్యా, ఉక్రెయిన్ లోనే గోధుమలు ఎక్కువగా పండుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో గ్లోబల్ సప్లై చైన్ కు విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంగా గోధుమల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ కారణాల వల్లే ఇటీవల ఇరాన్ నిత్యావసరాల ధరలను ఏకంగా 300 శాతం పెంచాయి.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!