Mallikarjun Kharge: జీ-20 సమావేశం ముగిసింది.. దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’లో పోస్ట్ చేస్తూ.., 2024లో మోడీ ప్రభుత్వం నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని విమర్శించారు. మరోవైపు జీ-20 సమావేశాలు ముగిసాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని ఖర్గే అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి కూడా ప్రస్తావించారు. “ఆగస్టులో సాధారణ ప్లేట్ ఫుడ్ ధర 24 శాతం పెరిగింది” అని ట్విట్టర్(X) లో రాసుకొచ్చారు. అంతేకాకుండా.. దేశంలో నిరుద్యోగం 8 శాతానికి చేరుకుందని.. యువత భవిష్యత్తు అంధకారమైందని తెలిపారు.
Read Also: Nara Family: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు..
Also Read
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
మోడీ ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల అవినీతి వెల్లువలా వచ్చిందని ఖర్గే ఆరోపించారు. కాగ్ అనేక నివేదికల్లో బీజేపీని బట్టబయలు చేసిందని.. జమ్మూకశ్మీర్లో రూ.13000 కోట్ల జల్జీవన్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అవినీతిని బయటపెట్టినందుకు దళిత ఐఏఎస్ అధికారిపై వేధింపులు జరిగాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని ప్రాణ స్నేహితుడి దోపిడీ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆర్బీఐ ఖజానా నుంచి రూ.3 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఒత్తిడిని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యతిరేకించారు. దీంతో ఈ బండారం బయటపడిందని చెప్పారు.
Read Also: IND vs PAK: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. వదలని వరుణుడు
ఇదిలా ఉంటే.. మణిపూర్లో మళ్లీ హింస జరిగింది. హిమాచల్ప్రదేశ్లో విపత్తు సంభవించింది. అయితే అహంకారపూరిత మోడీ ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించకుండా తప్పించుకుంటుందని ఖర్గే దుయ్యబట్టారు. వీటన్నింటి మధ్య మోడీ నిజాన్ని కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని చెదరగొట్టే సమస్యలకు బదులుగా వాస్తవాన్ని వినాలని, చూడాలని కోరుకుంటున్నారని ఖర్గే తెలిపారు. 2024లో బీజేపీ నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!