West Bengal : ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి.. ఆ స్కామ్ వల్లే..?
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపుర్ లో జరిగింది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ స్కామ్ లో ఉన్నవారే తమ మృతికి కారణమని రాసి ఉంది. ఈ దారుణ ఘటన దుర్గపుర్ లో జరిగింది.
Also Read : Uttarakhand : కుక్కపై కర్కశత్వం.. బండికి కట్టి ఈడ్చుకెళ్లిన వైనం
Also Read
- EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
- Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
- Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
- Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
మృతులు అమిత్ కుమార్ మొండల్(35), రూపా మొండల్(31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్(6), నిఖితా మొండల్( ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లల మృతదేహాలు కింద పడి ఉన్నాయి. మృతుల మొబైల్లో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో ఓ మెసేజ్ ఉంది. స్థానికులు మాత్రం అత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.
Also Read : Uttarakhand : విద్యార్థుల వీరంగం.. వార్డెన్ పై వేధింపులే కారణం!
అమిత్ కుటుంబం మృతికి అతని తల్లే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే అమిత్ తల్లి, కుంటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదం కారణంగానే అమిత్ కుటుంబాన్ని హత్య చేశారు. అమిత్ మెడపై గాయాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యే.. అందరి చేతులు కట్టేసి ఉన్నాయి సీసీ కెమెరా పాలిథీన్ కవర్ తో మూసేసి ఉంది. అమిత్ తల్లి, మిగతా కుటుంబసభ్యులే వారిని హత్య చేశారు. అమిత్ భార్య రూప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమిత్ తండ్రి.. నరేశ్ మొండల్ చాలా ఏళ్ల క్రితం మృతి చెందారు. అతను చాలా ఆస్తులు సంపాదించాడు. ఆ ఆస్తుల కోసమే వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారని డీసీపీ గౌతమ్ కుమార్ వెల్లడించారు. అమిత్ కుటంబ సభ్యుల మృతికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
-
Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
-
Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
-
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!