Family Suicide: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Suicide: హైదరాబాద్ నగరంలో పండుగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ గల తార్నాకలోని రూపాలి అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న మృతుల్లో నాలుగేళ్ల బాలిక, దంపతులు, మరో మహిళ ఉన్నారు. నలుగురు కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Family Drowned: పండుగపూట విషాదం.. కోటిపల్లి ప్రాజెక్టులో ఈతకు దిగి నలుగురు మృతి
Also Read
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
అపార్ట్మెంట్ వాసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దంపతులు ఇద్దరూ పెద్ద హోదాల్లోనే సెటిల్ అయ్యారు. ప్రతాప్(34) బీఎండబ్ల్యూ కారు షోరూంలో డిజైనర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తుండగా.. అతని భార్య సింధూర (32) హిమాయత్ నగర్లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారికి నాలుగేళ్ల వయస్సు గల చిన్నారి ఆద్య ఉంది. అయినా వారు ఇంతటి పిరికి చర్యకు ఎందుకు పాల్పడ్డారని బంధువులు వాపోతున్నారు. అయితే నలుగురు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.
నలుగురు మృతి చెందినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ వెల్లడించారు. ప్రతాప్తో పాటు తన భార్య సిందూర, కూతురు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆయన తెలిపారు. సింధూర బ్యాంకు ఆఫ్ బరోడాలో మేనేజర్గా పనిచేస్తోందని.. ఈరోజు డ్యూటీకి రాకపోవడంతో వారి తోటి ఉద్యోగులు తార్నాకలోని రూపాలి అపార్ట్మెంట్కు వచ్చారని పేర్కొన్నారు. ఆ సమయంలో అపార్ట్మెంట్ డోర్ వేసి ఉండగా.. కిటికీలోనుంచి చూసే సరికి ప్రతాప్ ఉరి వేసుకుని వేలాడుతున్నాడని.. డోర్ పగల గొట్టి లోపలికి వెళ్లే సరికి నలుగురు చనిపోయారని ఎస్సై చెప్పారు. తమకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశామని వెల్లడించారు. నాలుగు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించామన్నారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!