Family Suicide: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Suicide: హైదరాబాద్ నగరంలో పండుగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ గల తార్నాకలోని రూపాలి అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న మృతుల్లో నాలుగేళ్ల బాలిక, దంపతులు, మరో మహిళ ఉన్నారు. నలుగురు కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Family Drowned: పండుగపూట విషాదం.. కోటిపల్లి ప్రాజెక్టులో ఈతకు దిగి నలుగురు మృతి
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
అపార్ట్మెంట్ వాసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దంపతులు ఇద్దరూ పెద్ద హోదాల్లోనే సెటిల్ అయ్యారు. ప్రతాప్(34) బీఎండబ్ల్యూ కారు షోరూంలో డిజైనర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తుండగా.. అతని భార్య సింధూర (32) హిమాయత్ నగర్లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారికి నాలుగేళ్ల వయస్సు గల చిన్నారి ఆద్య ఉంది. అయినా వారు ఇంతటి పిరికి చర్యకు ఎందుకు పాల్పడ్డారని బంధువులు వాపోతున్నారు. అయితే నలుగురు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.
నలుగురు మృతి చెందినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ వెల్లడించారు. ప్రతాప్తో పాటు తన భార్య సిందూర, కూతురు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆయన తెలిపారు. సింధూర బ్యాంకు ఆఫ్ బరోడాలో మేనేజర్గా పనిచేస్తోందని.. ఈరోజు డ్యూటీకి రాకపోవడంతో వారి తోటి ఉద్యోగులు తార్నాకలోని రూపాలి అపార్ట్మెంట్కు వచ్చారని పేర్కొన్నారు. ఆ సమయంలో అపార్ట్మెంట్ డోర్ వేసి ఉండగా.. కిటికీలోనుంచి చూసే సరికి ప్రతాప్ ఉరి వేసుకుని వేలాడుతున్నాడని.. డోర్ పగల గొట్టి లోపలికి వెళ్లే సరికి నలుగురు చనిపోయారని ఎస్సై చెప్పారు. తమకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశామని వెల్లడించారు. నాలుగు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించామన్నారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..