Accident: ఏపీలో పండగపూట తీవ్ర విషాదం.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా మండపల్లి మండలం కానుకొల్లులో తీవ్ర విషాదం జరిగింది. ఇవాళ ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న యువతులపై నుంచి సడన్గా ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని అనే యువతి అక్కడికక్కడే మరణించగా.. మరో యువతి పల్లవి దుర్గకు తీవ్ర గాయాలైయ్యాయి. ఇక, స్థానికులు వెంటనే గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. దీంతో లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు.. మరొకరిని పట్టుకొని గ్రామస్తులు కొట్టారు చితకబాదిన తర్వాత పోలీసులకు పట్టించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: CM KCR: ఫామ్ హౌస్కి అవన్నీ పంపండి.. ఓ షాప్ యజమానికి కేసీఆర్ కాల్..
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
మరో వైపు, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పిల్లా పేరు వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని పామూరు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందినవారుగా గుర్తించారు. ఇక, కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పామర్రు కురుమద్దాలి గ్రామంలో పెట్రోల్ బంక్ నుంచి బైక్ కు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు హరీష్, గోవింద్ మరణించారు. ఇక, యువకుల మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయిన కుటుంబాలు.. కురుమద్దాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ రోజున ప్రమాదాలు జరగడంతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..