Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsized : తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఇక్కడ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై తాలిబన్ అధికారి ఒకరు సమాచారం అందించారు. మహ్మంద్ దారా జిల్లాలో నది దాటుతుండగా బోటు బోల్తా పడిందని, దీంతో బోటులో ఉన్న వారంతా మునిగిపోయారని నంగర్హర్ ప్రావిన్స్లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.
ఈ ప్రమాదంలో నీటిలో మునిగి 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. బోటులో 25 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఆ ప్రజలు ఎలాగో నీటిలోంచి ఈదుకుంటూ బయటపడ్డారు. మృతుల్లో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
Read Also:T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం!
ఐదు మృతదేహాలు వెలికితీత
నంగర్హార్ ఆరోగ్య శాఖ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయితో సహా ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సహాయక సిబ్బంది మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల గందరగోళం నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలీదు
వైద్య బృందం, అంబులెన్స్తో పాటు అవసరమైన అన్ని వస్తువులను ఆ ప్రాంతానికి పంపినట్లు తాలిబాన్ అధికారి తెలిపారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలేంటో చెప్పలేదు. మరోవైపు ప్రమాద సమాచారం అందిన వెంటనే మృతుల బంధువుల్లో రోదనలు మిన్నంటాయి. దీంతో బాధితుల ఇళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తరచుగా ఇతర గ్రామాలకు, స్థానిక మార్కెట్లకు వెళ్లడానికి పడవలో ప్రయాణిస్తుంటారని చెబుతున్నారు. పడవల సహాయంతో మాత్రమే ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళతారు.
Read Also:Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!