Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
Boat Capsized : తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఇక్కడ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై తాలిబన్ అధికారి ఒకరు సమాచారం అందించారు. మహ్మంద్ దారా జిల్లాలో నది దాటుతుండగా బోటు బోల్తా పడిందని, దీంతో బోటులో ఉన్న వారంతా మునిగిపోయారని నంగర్హర్ ప్రావిన్స్లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.
ఈ ప్రమాదంలో నీటిలో మునిగి 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. బోటులో 25 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఆ ప్రజలు ఎలాగో నీటిలోంచి ఈదుకుంటూ బయటపడ్డారు. మృతుల్లో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
Also Read
Read Also:T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం!
ఐదు మృతదేహాలు వెలికితీత
నంగర్హార్ ఆరోగ్య శాఖ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయితో సహా ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సహాయక సిబ్బంది మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల గందరగోళం నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలీదు
వైద్య బృందం, అంబులెన్స్తో పాటు అవసరమైన అన్ని వస్తువులను ఆ ప్రాంతానికి పంపినట్లు తాలిబాన్ అధికారి తెలిపారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలేంటో చెప్పలేదు. మరోవైపు ప్రమాద సమాచారం అందిన వెంటనే మృతుల బంధువుల్లో రోదనలు మిన్నంటాయి. దీంతో బాధితుల ఇళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తరచుగా ఇతర గ్రామాలకు, స్థానిక మార్కెట్లకు వెళ్లడానికి పడవలో ప్రయాణిస్తుంటారని చెబుతున్నారు. పడవల సహాయంతో మాత్రమే ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళతారు.
Read Also:Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
తాజావార్తలు
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!