Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsized : తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఇక్కడ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై తాలిబన్ అధికారి ఒకరు సమాచారం అందించారు. మహ్మంద్ దారా జిల్లాలో నది దాటుతుండగా బోటు బోల్తా పడిందని, దీంతో బోటులో ఉన్న వారంతా మునిగిపోయారని నంగర్హర్ ప్రావిన్స్లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.
ఈ ప్రమాదంలో నీటిలో మునిగి 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. బోటులో 25 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఆ ప్రజలు ఎలాగో నీటిలోంచి ఈదుకుంటూ బయటపడ్డారు. మృతుల్లో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Read Also:T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం!
ఐదు మృతదేహాలు వెలికితీత
నంగర్హార్ ఆరోగ్య శాఖ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయితో సహా ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సహాయక సిబ్బంది మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల గందరగోళం నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలీదు
వైద్య బృందం, అంబులెన్స్తో పాటు అవసరమైన అన్ని వస్తువులను ఆ ప్రాంతానికి పంపినట్లు తాలిబాన్ అధికారి తెలిపారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలేంటో చెప్పలేదు. మరోవైపు ప్రమాద సమాచారం అందిన వెంటనే మృతుల బంధువుల్లో రోదనలు మిన్నంటాయి. దీంతో బాధితుల ఇళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తరచుగా ఇతర గ్రామాలకు, స్థానిక మార్కెట్లకు వెళ్లడానికి పడవలో ప్రయాణిస్తుంటారని చెబుతున్నారు. పడవల సహాయంతో మాత్రమే ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళతారు.
Read Also:Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!