Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsized : తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఇక్కడ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై తాలిబన్ అధికారి ఒకరు సమాచారం అందించారు. మహ్మంద్ దారా జిల్లాలో నది దాటుతుండగా బోటు బోల్తా పడిందని, దీంతో బోటులో ఉన్న వారంతా మునిగిపోయారని నంగర్హర్ ప్రావిన్స్లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.
ఈ ప్రమాదంలో నీటిలో మునిగి 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. బోటులో 25 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఆ ప్రజలు ఎలాగో నీటిలోంచి ఈదుకుంటూ బయటపడ్డారు. మృతుల్లో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Read Also:T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం!
ఐదు మృతదేహాలు వెలికితీత
నంగర్హార్ ఆరోగ్య శాఖ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయితో సహా ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సహాయక సిబ్బంది మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల గందరగోళం నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలీదు
వైద్య బృందం, అంబులెన్స్తో పాటు అవసరమైన అన్ని వస్తువులను ఆ ప్రాంతానికి పంపినట్లు తాలిబాన్ అధికారి తెలిపారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలేంటో చెప్పలేదు. మరోవైపు ప్రమాద సమాచారం అందిన వెంటనే మృతుల బంధువుల్లో రోదనలు మిన్నంటాయి. దీంతో బాధితుల ఇళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తరచుగా ఇతర గ్రామాలకు, స్థానిక మార్కెట్లకు వెళ్లడానికి పడవలో ప్రయాణిస్తుంటారని చెబుతున్నారు. పడవల సహాయంతో మాత్రమే ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళతారు.
Read Also:Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!