Cricketers Arrest: మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ముగ్గురు క్రికెటర్లు అరెస్ట్..
- మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ముగ్గురు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు అరెస్ట్
- లోన్వాబో త్సోత్సోబే, థమీ సోలెకిలే, ఎథి మభలాటి అరెస్ట్
- మ్యాచ్ జరుగుతుండగానే అరెస్టు చేసిన పోలీసులు
- 2015-16 రామ్స్లామ్ టీ-20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అదుపులోకి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, వన్డేలో ప్రపంచ మాజీ నంబర్ 1 బౌలర్ లోన్వాబో త్సోత్సోబే అరెస్టయ్యాడు. ఇతనితో పాటు థమీ సోలెకిలే, ఎథి మభలాటి అరెస్టయ్యారు. మ్యాచ్ జరుగుతుండగానే పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 2015-16 రామ్స్లామ్ టీ-20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ క్రికెటర్లపై ఐదు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు 2004 సంవత్సరపు అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం, క్రీడా పోటీల ఫలితాలను ప్రభావితం చేయడానికి లేదా క్రీడల పవిత్రతను దెబ్బతీయడానికి లంచాలు ఇవ్వడం లేదా తీసుకోవడం అనేది అవినీతికి ఉదాహరణ.
Read Also: Lucky Bhaskar : ఓటీటీలోనూ దూసుకుపోతున్న లక్కీ భాస్కర్..
Also Read
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
- SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
2016 – 2017 మధ్య కాలంలో ఈ టీ20 టోర్నమెంట్లో మ్యాచ్లు ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినందుకు క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) ఈ ముగ్గురితో పాటు మరో నలుగురు ఆటగాళ్లపై నిషేధం విధించింది. ఈ కేసులో గులాం బోడి ఇప్పటికే జైలు శిక్ష అనుభవించగా.. జీన్ సైమ్స్, పుమి మట్షిక్వే 2021, 2022లో తప్పు ఒప్పుకున్నందుకు సస్పెండ్ పనిష్మెంట్ పొందారు. మరోవైపు.. లోన్వాబో త్సోత్సోబే, థమీ త్సోలేకిలే, ఎథీ మ్భలాటిలపై ఉన్న కేసులు 2025 ఫిబ్రవరి వరకు వాయిదా పడ్డాయి. మరో ఆటగాడు అల్విరో పెటర్సన్పై ఏ చర్యలు తీసుకున్నారనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం తెలియ రాలేదు. ఈ ఆటగాళ్లందరినీ క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) రెండు నుంచి 12 సంవత్సరాల వరకు నిషేధించింది. 2000లో హన్సీ క్రోన్యే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం జరిగిన తర్వాత అవినీతి నిరోధక చట్టం తీసుకువచ్చారు. క్రీడల్లో అవినీతికి పాల్పడిన ఆటగాళ్లపై ఈ చట్టం ఉపయోగించిన తొలి సందర్భం ఇదేనని భావిస్తున్నారు.
Read Also: IND U19 vs PAK U19: ఏంటీ బ్రో.. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశావ్..!
హాక్స్గా పేరొందిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రయారిటీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ (డీపీసీఐ) ఈ ఆరోపణలపై విచారణ చేపట్టింది. హాక్స్ సంస్థ క్రీడల పవిత్రతను కాపాడటం, అవినీతిని అంతం చేయడంపై ఫోకస్ పెట్టింది. విచారణ సమయంలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) ఎలాంటి మ్యాచ్ ఫిక్స్ చేయబడలేదని స్పష్టం చేసింది. అయితే, గులాం బోడి ఇండియాకు చెందిన బుక్మేకర్ల సహాయంతో మూడు మ్యాచ్లను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించాడని విచారణలో వెల్లడైంది. అయితే.. ఆ మ్యాచ్ల్లో ఫిక్సింగ్ జరగలేదు.
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
-
KING : షారూఖ్ ఖాన్ కింగ్ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
-
SPIRIT : ప్రభాస్తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!