విజయవాడలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి పాత్ర గణనీయమైనదని పేర్కొన్నారు.
వర్గీకరణ కోసం పోరాటం చేసిన సమయంలో పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎం జగన్ ను కోరినట్లు మంత్రి ఆదిమూలపు తెలిపారు. మందకృష్ణ మాదిగతో పాటు మాదిగలందరి పైనా పెట్టిన కేసులు ఎత్తేయాలని వినతిపత్రం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.