Ambati Rambabu : నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!
- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉంది
- అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామన్న మాజీ మంత్రి
- కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వచ్చిందన్న అంబటి
- మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారని.. ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారని.. ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలని.. దోచుకునే బ్యాచ్ కే పండగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలని సూచించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు2 సమయానికి జనం తిరగబడొచ్చని మాజీ మంత్రి తెలిపారు.
READ MORE: Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్ చేశారని.. బెదిరించి, భయపెట్టాలని చూశారన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. “లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు. నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. కేసులకు నేను భయపడను… డోంట్ కేర్… న్యాయస్థానంలో తేల్చుకుంటా. సీఐని వదిలిపెట్టేది లేదు. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నాపై స్పీడుగా కేసులు పెట్టి… నా ఫిర్యాదులపై కేసు నమోదు చెయ్యలేదు. రాజకీయాల్లో ఉండాలంటే కేసులు, జైలుకెళ్లడానికి భయపడకూడదు. తుని ఘటనకు సంబంధించి జీఓ ఇచ్చారు… మళ్లీ రద్దు చేశారు. సీఎం, హోంమంత్రి, మంత్రులకు తెలియకుండా జీఓ వస్తుందా? రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టిన కేసుపై ఎవరికీ తెలియకుండా జీఓ వచ్చిందంటే ఎలా చూడాలి. రాష్ట్రంలో ఏడాదిలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని పరిపాలన చెయ్యడమే తప్ప మంచి పాలన చెయ్యలేవు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేషీలో పనిచేసిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. జగన్ ను మీరు అనుకున్నా అరెస్ట్ చెయ్యలేరు. రాష్ట్రంలో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న మాస్ లీడర్ జగన్. డీజీపీకి ఇప్పటికి యాభైసార్లు ఫోన్ చేశా… కానీ ఆయన స్పందించరు. నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. న్యాయస్థానాలు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ ఉందా. వంగవీటి రంగా హత్య తరహాలో పోలీసులు హత్య కూడా చేయిస్తారేమో.. ఇది రాబోయేకాలంలో ప్రమాదకరంగా మారొచ్చు. పోలీసులు టీడీపీ గూండాల్లా పనిచేస్తున్నారు. మంచి పోలీసులు లూప్ లైన్ లో ఉన్నారు.” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: PV Sindhu: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..!
తాజావార్తలు
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!