Ambati Rambabu : నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!
- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉంది
- అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామన్న మాజీ మంత్రి
- కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వచ్చిందన్న అంబటి
- మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారని.. ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారని.. ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలని.. దోచుకునే బ్యాచ్ కే పండగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలని సూచించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు2 సమయానికి జనం తిరగబడొచ్చని మాజీ మంత్రి తెలిపారు.
READ MORE: Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్
Also Read
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్ చేశారని.. బెదిరించి, భయపెట్టాలని చూశారన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. “లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు. నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. కేసులకు నేను భయపడను… డోంట్ కేర్… న్యాయస్థానంలో తేల్చుకుంటా. సీఐని వదిలిపెట్టేది లేదు. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నాపై స్పీడుగా కేసులు పెట్టి… నా ఫిర్యాదులపై కేసు నమోదు చెయ్యలేదు. రాజకీయాల్లో ఉండాలంటే కేసులు, జైలుకెళ్లడానికి భయపడకూడదు. తుని ఘటనకు సంబంధించి జీఓ ఇచ్చారు… మళ్లీ రద్దు చేశారు. సీఎం, హోంమంత్రి, మంత్రులకు తెలియకుండా జీఓ వస్తుందా? రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టిన కేసుపై ఎవరికీ తెలియకుండా జీఓ వచ్చిందంటే ఎలా చూడాలి. రాష్ట్రంలో ఏడాదిలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని పరిపాలన చెయ్యడమే తప్ప మంచి పాలన చెయ్యలేవు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేషీలో పనిచేసిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. జగన్ ను మీరు అనుకున్నా అరెస్ట్ చెయ్యలేరు. రాష్ట్రంలో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న మాస్ లీడర్ జగన్. డీజీపీకి ఇప్పటికి యాభైసార్లు ఫోన్ చేశా… కానీ ఆయన స్పందించరు. నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. న్యాయస్థానాలు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ ఉందా. వంగవీటి రంగా హత్య తరహాలో పోలీసులు హత్య కూడా చేయిస్తారేమో.. ఇది రాబోయేకాలంలో ప్రమాదకరంగా మారొచ్చు. పోలీసులు టీడీపీ గూండాల్లా పనిచేస్తున్నారు. మంచి పోలీసులు లూప్ లైన్ లో ఉన్నారు.” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: PV Sindhu: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..!
తాజావార్తలు
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!