Ambati Rambabu : నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!
- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉంది
- అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామన్న మాజీ మంత్రి
- కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వచ్చిందన్న అంబటి
- మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారని.. ఏడాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారని.. ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలని.. దోచుకునే బ్యాచ్ కే పండగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలని సూచించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు2 సమయానికి జనం తిరగబడొచ్చని మాజీ మంత్రి తెలిపారు.
READ MORE: Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్ చేశారని.. బెదిరించి, భయపెట్టాలని చూశారన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. “లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు. నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. కేసులకు నేను భయపడను… డోంట్ కేర్… న్యాయస్థానంలో తేల్చుకుంటా. సీఐని వదిలిపెట్టేది లేదు. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నాపై స్పీడుగా కేసులు పెట్టి… నా ఫిర్యాదులపై కేసు నమోదు చెయ్యలేదు. రాజకీయాల్లో ఉండాలంటే కేసులు, జైలుకెళ్లడానికి భయపడకూడదు. తుని ఘటనకు సంబంధించి జీఓ ఇచ్చారు… మళ్లీ రద్దు చేశారు. సీఎం, హోంమంత్రి, మంత్రులకు తెలియకుండా జీఓ వస్తుందా? రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టిన కేసుపై ఎవరికీ తెలియకుండా జీఓ వచ్చిందంటే ఎలా చూడాలి. రాష్ట్రంలో ఏడాదిలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని పరిపాలన చెయ్యడమే తప్ప మంచి పాలన చెయ్యలేవు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేషీలో పనిచేసిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. జగన్ ను మీరు అనుకున్నా అరెస్ట్ చెయ్యలేరు. రాష్ట్రంలో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న మాస్ లీడర్ జగన్. డీజీపీకి ఇప్పటికి యాభైసార్లు ఫోన్ చేశా… కానీ ఆయన స్పందించరు. నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. న్యాయస్థానాలు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ ఉందా. వంగవీటి రంగా హత్య తరహాలో పోలీసులు హత్య కూడా చేయిస్తారేమో.. ఇది రాబోయేకాలంలో ప్రమాదకరంగా మారొచ్చు. పోలీసులు టీడీపీ గూండాల్లా పనిచేస్తున్నారు. మంచి పోలీసులు లూప్ లైన్ లో ఉన్నారు.” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: PV Sindhu: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 నుంచి పీవీ సింధు అవుట్..!
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..