Millet Breakfast Recipes: రుచిలో అదుర్స్.. పోషకాల్లో నెంబర్ 1! ఇన్స్టంట్గా రెడీ చేసుకునే బెస్ట్ రాగి బ్రేక్ఫాస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millet Breakfast Recipes: ఈ రోజుల్లో హెల్త్ గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో అనేక అవస్థలు ఎదుర్కొనే వచ్చే అవకాశం ఉంది. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారాలి. ప్రతిఒక్కరి రోజు వారి డైట్లో ఆరోగ్యకరమైన ఆహారాలను భాగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో హెల్తీ ఆప్షన్స్ కోసం వెతికే వారికి రాగి పిండి ఒక అద్భుతమైన ఎంపిక. పప్పులు నానబెట్టే పని లేకుండా, పిండిని పులియబెట్టే అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో చేసుకునే రెండు అదిరిపోయే రాగి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
- Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
- Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
ఇన్స్టంట్ రాగి ఇడ్లీ ..
సాధారణ ఇడ్లీల కంటే ఇవి ఎంతో రుచిగా, సాఫ్ట్గా ఉంటాయి.
తయారీ విధానం: ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు (శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర), పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి, ఆపై ఒక కప్పు రాగి పిండి కూడా వేసి కాసేపు వేడి చేయాలి. ఈ మిశ్రమం చల్లారాక, అందులో ఒక కప్పు పులిసిన పెరుగు, సరిపడా ఉప్పు, నీళ్లు కలిపి 15-20 నిమిషాలు నానబెట్టాలి. చివరగా అర టీస్పూన్ వంట సోడా కలిపి, ఇడ్లీ పాత్రలో 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికిస్తే మెత్తని రాగి ఇడ్లీలు సిద్ధం.
క్రిస్పీ రాగి దోశ..
రవ్వ దోశ లాగే చాలా పల్చగా, కరకరలాడుతూ ఉండే ఈ దోశ డైట్ చేసేవారికి బెస్ట్ ఛాయిస్.
తయారీ విధానం:
మిక్సీ జార్లో ఒక కప్పు రాగి పిండి, అర కప్పు బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, కొంచెం పెరుగు, ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టి, ఆ తర్వాత అందులో జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు వేసి రవ్వ దోశ పిండిలా పల్చగా కలుపుకోవాలి. పెనం బాగా కాలిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము చల్లి, పిండిని పల్చగా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే క్రిస్పీ రాగి దోశ రెడీ.
ఈ రెసిపీలు ఎందుకు ప్రత్యేకం అంటే..
రాగిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుతుంది. అలాగే పప్పులు నానబెట్టడం లేదా రుబ్బడం వంటి శ్రమ ఏమీ లేదు కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది. వీటికి టమాటా చట్నీ లేదా కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్. కుదిరితే ఒకసారి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ను మీ ఇంట్లో ట్రై చేయండి.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!