Millet Breakfast Recipes: రుచిలో అదుర్స్.. పోషకాల్లో నెంబర్ 1! ఇన్స్టంట్గా రెడీ చేసుకునే బెస్ట్ రాగి బ్రేక్ఫాస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millet Breakfast Recipes: ఈ రోజుల్లో హెల్త్ గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో అనేక అవస్థలు ఎదుర్కొనే వచ్చే అవకాశం ఉంది. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారాలి. ప్రతిఒక్కరి రోజు వారి డైట్లో ఆరోగ్యకరమైన ఆహారాలను భాగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్లో హెల్తీ ఆప్షన్స్ కోసం వెతికే వారికి రాగి పిండి ఒక అద్భుతమైన ఎంపిక. పప్పులు నానబెట్టే పని లేకుండా, పిండిని పులియబెట్టే అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో చేసుకునే రెండు అదిరిపోయే రాగి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
ఇన్స్టంట్ రాగి ఇడ్లీ ..
సాధారణ ఇడ్లీల కంటే ఇవి ఎంతో రుచిగా, సాఫ్ట్గా ఉంటాయి.
తయారీ విధానం: ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు (శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర), పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి, ఆపై ఒక కప్పు రాగి పిండి కూడా వేసి కాసేపు వేడి చేయాలి. ఈ మిశ్రమం చల్లారాక, అందులో ఒక కప్పు పులిసిన పెరుగు, సరిపడా ఉప్పు, నీళ్లు కలిపి 15-20 నిమిషాలు నానబెట్టాలి. చివరగా అర టీస్పూన్ వంట సోడా కలిపి, ఇడ్లీ పాత్రలో 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికిస్తే మెత్తని రాగి ఇడ్లీలు సిద్ధం.
క్రిస్పీ రాగి దోశ..
రవ్వ దోశ లాగే చాలా పల్చగా, కరకరలాడుతూ ఉండే ఈ దోశ డైట్ చేసేవారికి బెస్ట్ ఛాయిస్.
తయారీ విధానం:
మిక్సీ జార్లో ఒక కప్పు రాగి పిండి, అర కప్పు బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, కొంచెం పెరుగు, ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టి, ఆ తర్వాత అందులో జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు వేసి రవ్వ దోశ పిండిలా పల్చగా కలుపుకోవాలి. పెనం బాగా కాలిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము చల్లి, పిండిని పల్చగా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే క్రిస్పీ రాగి దోశ రెడీ.
ఈ రెసిపీలు ఎందుకు ప్రత్యేకం అంటే..
రాగిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుతుంది. అలాగే పప్పులు నానబెట్టడం లేదా రుబ్బడం వంటి శ్రమ ఏమీ లేదు కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది. వీటికి టమాటా చట్నీ లేదా కొబ్బరి చట్నీ బెస్ట్ కాంబినేషన్. కుదిరితే ఒకసారి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ను మీ ఇంట్లో ట్రై చేయండి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!