ENG vs IND: ఒక్క టెస్టులో 5 సెంచరీలు.. కానీ ఏం లాభం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG vs IND: భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్లతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ చివరి, ఐదవ రోజు మంగళవారం నాడు ఇంగ్లాండ్ జట్టుకు విజయంకోసం 350 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 149, జాక్ క్రౌలీ 65, బెన్ స్టోక్స్ 33 పరుగులు చేసి విజయానికి బాటలు వేశారు. ఇక భారత్ తరపున శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
Read Also:Off The Record: సింగరేణిలో కేసీఆర్ కుటుంబ విబేధాల ఎఫెక్ట్..? కవిత టూర్తో కేటీఆర్ అలర్ట్ అయ్యారా?
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
నిజానికి భారత్ ఇంగ్లాండ్ కు భారీ లక్షాన్నే పెట్టింది. కానీ భారత్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో తేలిపోవడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. భారత్ ఇంగ్లాండ్ జట్టుకు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్ దానిని చేధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఇంగ్లాండ్ 465 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో భారత్ కు 6 పరుగుల లీడ్ లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెన్ డకెట్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది.
Read Also:Today Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభాలే!
ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు నుంచి 5 సెంచరీలు వచ్చినా మ్యాచ్ మాత్రం గెలవలేక పోయారు. మ్యాచ్ గెలవలేక పోవడానికి ప్రధాన కారణం 9 క్యాచ్ లను వదిలిపెట్టడం. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 6 క్యాచ్ లు, రెండో ఇన్నింగ్స్లో 3 క్యాచ్ లను విడిచిపెట్టడంతో ఇంగ్లాండ్ కు బాగా కలిసి వచ్చింది. దీంతో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో ఇంగ్లాండ్ టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 0-1తో వెనుకబడింది. ఇక ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ జూలై 2 నుండి బర్మింగ్ హామ్ లో జరగనుంది.
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..