Chhattisgarh: భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు.. నక్సలైట్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని ధామ్తరి జిల్లా ఏక్వారీ అడవుల్లో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు ఓ నక్సలైట్ ను హతం చేశారు. గంటల తరబడి ఈ కాల్పులు కొనసాగాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు రైఫిళ్లు, మావోయిస్టులు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బోరై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకవారి అటవీప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో కాల్పులు జరిపినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Read Also: Minister Harish Rao: మ్యానిఫెస్టోలో చెప్పినవి.. చేసింది కేసీఆర్ మాత్రమే..
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
ధామ్తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర ఎస్డీఓపీ మయాంక్ రాంసింగ్ నేతృత్వంలో కూంబింగ్ నిర్వహించారు. దీంతో జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు రావడం చూసి నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువైపులా దాదాపు 880 రౌండ్ల బుల్లెట్లు పేల్చారు. ఈ ఎన్కౌంటర్ లో కొంతమంది నక్సలైట్లు గాయపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే మృతిచెందిన నక్సలైట్ వివరాలు ఇంకా తెలియరాలేదని.. ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు రాయ్పూర్ రేంజ్ ఐజీ తెలిపారు.
Read Also: Mukesh Ambani: డిసెంబర్ నాటికి దేశమంతా జియో 5జీ.. “జియో ఎయిర్ ఫైబర్” లాంచింగ్ డేట్ ఫిక్స్..
మరోవైపు నక్సలైట్ల వ్యతిరేక ప్రచారాన్ని పోలీసులు నిరంతరం నిర్వహిస్తున్నామని, ఎక్వారీ అడవుల్లో నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం అందిందని ధామ్తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. దీంతో ధామ్తరి పోలీసులు, గరియాబంద్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల సంయుక్త బృందం అడవికి వెళ్లింది. పోలీసు సిబ్బందిని చూసిన నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు. ఆ తర్వాత జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారని.. ఓ నక్సలైట్ని జవాన్లు హతమార్చారన్నారు.
తాజావార్తలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!