Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే రుచికరమైన క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్...
- బియ్యం, శనగపప్పు, బంగాళాదుంపలతో ఈ స్నాక్ను తయారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crispy Veggie Fingers: ఇంట్లో పిల్లలు ఉంటే వారికి రోజూ కూరగాయలు, పప్పులు తినిపించడం పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి సమయంలో ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే బయట దొరికే స్నాక్స్లా ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే శనగపప్పు, బియ్యం ఫింగర్స్ తయారుచేయవచ్చు. అదేనండి.. ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ అనమాట. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ స్నాక్ పిల్లల లంచ్ బాక్స్కే కాకుండా, పెద్దల సాయంత్రం టీ టైమ్కు కూడా పనికి వస్తాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా..
కావాల్సిన పదార్థాలు:
* బియ్యం: 1 కప్పు
* శనగపప్పు: ½ కప్పు
* ఉడికించిన బంగాళాదుంపలు: 2
* పచ్చిమిర్చి: 2
* అల్లం తరుగు: 1 టీస్పూన్
* కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు
* జీలకర్ర: ½ టీస్పూన్
* కారం పొడి: ½ టీస్పూన్
* చాట్ మసాలా: ½ టీస్పూన్
* గరం మసాలా: ¼ టీస్పూన్
* నిమ్మరసం: 1 టీస్పూన్
* బ్రెడ్ పొడి: ½ కప్పు
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె: వేయించడానికి సరిపడా
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్ల క్లీనింగ్కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
- Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
తయారీ విధానం:
ముందుగా బియ్యం, శనగపప్పును శుభ్రంగా కడిగి 5 గంటల పాటు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టాలి. నానిన బియ్యం, శనగపప్పులను పచ్చిమిర్చి, అల్లంతో కలిపి మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా (కోర్స్గా) రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కడాయిలో వేసి సన్నని మంటపై కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడి పిండి ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వండి.
పిండి చల్లారిన తర్వాత అందులో ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, కొత్తిమీర, జీలకర్ర, కారం, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిని పొడవాటి ఫింగర్స్ ఆకారంలో రూపొందించండి. ఆ తర్వాత వీటిని బ్రెడ్ పొడిలో అటుఇటు ముంచి అంతటా సమానంగా కోటింగ్ వచ్చేలా చేయండి. కడాయిలో నూనె వేడి చేసి, మీడియం మంటపై ఈ ఫింగర్స్ను బంగారు రంగు వచ్చేవరకు కరకరలాడేలా వేయించి టిష్యూ పేపర్పైకి తీసుకోండి. ఈ వేడివేడి శనగపప్పు-బియ్యం ఫింగర్స్ను టొమాటో సాస్, పుదీనా చట్నీ లేదా చింతపండు చట్నీతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటాయి. అంతే సింపుల్.. ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ రెడీ..
ముఖ్యమైన చిట్కా:
పిండి మిశ్రమాన్ని కడాయిలో ఉడికించేటప్పుడు అది చక్కగా దగ్గరపడే వరకు కలపాలి. మిశ్రమం పల్చగా ఉంటే ఫింగర్స్ ఆకారం రాకపోవడమే కాకుండా, నూనెలో వేయించేటప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!