Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తూ ఆరుగురు మృతి
- మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం
- దైవ దర్శనానికి వెళ్తున్న ఆరుగురు మృతి
- జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదం
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం
- మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న ఆరుగురు మృత్యువాత చెందారు. ఖతుశ్యామ్ బాబాను దర్శించుకునేందుకు వెళ్తుండగా జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం భక్తులతో వెళ్తున్న కారును ఢీకొట్టింది.. అనంతరం ప్రమాదం చేసిన వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ప్రమాదానికి గురైన కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడానికి చాలా కష్టమైంది. క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.
PM Modi: 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని.. ఈ రాష్ట్రాలకు ప్రయోజనం
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
ఈ ప్రమాదంలో గాయపడిన మనోజ్, ప్రదీప్, అనికేత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా దేవాస్ నివాసితులు. కాగా.. ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కోటకు తరలించారు. ఈ ప్రమాదంలో.. మదన్, మంగీలాల్, మహేష్, రాజేష్, పూనమ్ మృతి చెందారు. మరొకరి వివరాలు తెలియరాలేదు. మరోవైపు.. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించారు. అనంతరం.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Bihar: పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైల్ ఇంజన్.. తప్పిన ప్రమాదం
కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కంకరతో నిండిన డంపర్ రాంగ్ సైడ్ నుంచి ఢీ కొట్టినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. X లో స్పందిస్తూ.. ‘ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని బాబా మహాకల్ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ దుఃఖ సమయంలో, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!