PM Modi: 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని.. ఈ రాష్ట్రాలకు ప్రయోజనం
- 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందే భారత్ రైళ్లు ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు ప్రధాని మోడీ 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. టాటానగర్ స్టేషన్లో కేంద్రమంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, అన్నపూర్ణాదేవి, సంజయ్ సేథ్లతో పాటు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ రైళ్లతో కనెక్టివిటీ, సురక్షితమైన ప్రయాణం, ప్రయాణికుల సౌకర్యాలు పెరుగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత వాటి సంఖ్య 54 నుండి 60కి పెరిగింది. ఈ విధంగా వందే భారత్ రైళ్లు రోజుకు 120 ట్రిప్పుల ద్వారా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 280 కంటే ఎక్కువ జిల్లాలను కవర్ చేస్తున్నాయి.
Read Also: Bihar: పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైల్ ఇంజన్.. తప్పిన ప్రమాదం
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
కొత్తగా ప్రారంభించిన రైళ్లు.. టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా మరియు గయా-హౌరా మార్గాల్లో నడుస్తాయి. దీంతో.. బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కాగా.. మొదటి వందే భారత్ రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ఈ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Read Also: Rain Alert: ఈ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2024 సెప్టెంబర్ 14 వరకు 54 రైళ్లతో (ఆన్-డౌన్లతో సహా 108 ట్రిప్పులు) మొత్తం 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చాయి. మరోవైపు.. వందే భారత్ రైలు సెట్ ఇప్పుడు వందే భారత్ 2.0గా రూపాంతరం చెందింది. ఈ రైలు వేగం, కవచం, యాంటీ-వైరస్ సిస్టమ్, వైఫై వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. మరోవైపు.. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వందే భారత్ పోర్ట్ఫోలియో నిరంతరం విస్తరిస్తోంది. మెరుగైన కనెక్టివిటీ కోసం కొత్త రైళ్లను అందులో చేర్చారు. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద దేశీయంగా రూపొందించిన ఈ రైలు లక్షలాది మంది ప్రయాణికులకు లగ్జరీ, అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది.
#WATCH | PM Modi virtually flags off the Tatanagar-Patna Vande Bharat train at Tatanagar Junction Railway Station.
He will also lay the foundation stone and dedicate to the nation various Railway Projects worth more than Rs. 660 crores and distribute sanction letters to 20,000… pic.twitter.com/vNiDMSA6tK
— ANI (@ANI) September 15, 2024
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..