NEET : నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET : జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పరీక్షను ఒక్కే షిఫ్ట్లో నిర్వహించాల్సి ఉండటంతో, తగిన మౌలిక సదుపాయాలు, పరీక్షా కేంద్రాల ఏర్పాటులో సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు NBEMS పేర్కొంది. త్వరలోనే పరీక్ష కోసం కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
Chennai Love Story : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్, గ్లింప్స్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
నీట్ పీజీ 2025 పరీక్ష నిర్వహణ విషయంలో మే 30న సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజారియాల ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, పరీక్షను రెండు షిఫ్టుల్లో కాకుండా ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని స్పష్టం చేసింది. రెండు షిఫ్ట్ల విధానంలో ప్రశ్నాపత్రాల కఠినత స్థాయిలో తేడా ఉండే అవకాశం ఉండటంతో అది అసమతుల్యంగా మారే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
పరీక్షలో ప్రతీ మార్క్కు అధిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో, నార్మలైజేషన్ విధానాన్ని సాధారణ పరీక్షలకన్నా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలని సూచించింది. పరీక్షా నిర్వహణలో పారదర్శకత పాటించడంతో పాటు, దేశవ్యాప్తంగా సురక్షిత పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలన్న సూచనను కూడా చేసింది. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు తెలిపిన NBEMS పై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక పరీక్ష తేదీ వాయిదా వేసే స్వేచ్ఛ NBEMS కు ఉందని కూడా కోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూన్ 14న జరగనుంది.
CPI Ramakrishna: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తాం..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..