Delhi: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర! సరిహద్దు్ల్లో రోడ్డుకు మేకులు, కాంక్రీట్ గోడ…
- తమ డిమాండ్లు పరిష్కరించాలని రైతుల నిరసన
- ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు
- నేడు మళ్లీ రైతుల పాదయాత్ర
- సరిహద్దు్ల్లో రోడ్డుకు మేకులు, కాంక్రీట్ గోడ
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల ‘జాతా’ ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
READ MORE: Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
రైతుల బృందం డిసెంబర్ 6 న ఢిల్లీ వైపు బయలుదేరింది. అయితే హర్యానా పోలీసులు వారిని శంభు సరిహద్దు వద్ద ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వారిని ఆపడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇందులో కనీసం 16 మంది రైతులు గాయపడ్డారు. దీని తరువాత, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ రెండు రోజుల పాటు ఢిల్లీ మార్చ్ను నిలిపివేశారు. కేంద్రం నుంచి చర్చల కోసం ఏదైనా ప్రతిపాదన వస్తే.. రేపటి వరకు వేచి ఉంటామన్నారు. కేంద్రంతో తమకు ఎలాంటి విభేదాలు అక్కర్లేదని.. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు.
READ MORE:Pushpa 2 : పుష్ప-2 టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది : మైత్రీ నిర్మాతలు
కాగా.. నేడు రైతులకు అడ్డుకునేందుకు నిరసనకారులు ఢిల్లీ వైపు వెళ్లకుండా సరిహద్దులో బారికేడింగ్ పటిష్టంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రోడ్లపై ఇనుప మేకులను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్తో పాటు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. ఈ సస్పెన్షన్ డిసెంబర్ 9 వరకు అమల్లో ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!