Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు
- స్లాబ్ విస్తీర్ణం పెంచితే నిధుల విడుదలకు బ్రేక్
- అప్పుల బారిన పడకుండా ఉండేందుకే తాజా నిర్ణయం
- జీఐ షీట్లు, సన్షేడ్ల వినియోగానికి ప్రభుత్వ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ కీలక షాక్ ఇచ్చింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా, అనుమతించిన ప్లాన్కు మించి స్లాబ్ విస్తీర్ణాన్ని పెంచే వారిపై గట్టి నియంత్రణ విధించింది. ఇకపై నిబంధనలు అతిక్రమించి పెద్ద సైజుల్లో స్లాబులు వేస్తే ప్రభుత్వ నిధుల విడుదల నిలిచిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు కూడా వర్తిస్తాయని గృహనిర్మాణ శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అప్పుల బారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం
క్షేత్రస్థాయిలో చాలా మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గోడల కంటే 3 నుంచి 8 అడుగుల వరకు స్లాబ్ను ముందుకు పొడిగిస్తూ భారీగా ఖర్చు పెంచుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయల సాయం సరిపోక, మిగిలిన మొత్తానికి పేదలు అప్పుల బారిన పడుతున్నారు. మరికొందరు ఆర్థిక భారం తట్టుకోలేక ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఈ ఇబ్బందులను అరికట్టి, ప్రభుత్వ సాయంతోనే ఇళ్లు పూర్తిగా పూర్తి కావాలనే ఆందోళనతో అధికారులు స్లాబ్ వైశాల్యంపై పరిమితులు విధించారు.
Also Read
కొత్త కొలతలు , నిబంధనలు ఇవే
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ వైశాల్యం గరిష్టంగా 500 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలి. అలాగే, 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ గరిష్టంగా 750 చదరపు అడుగుల వరకే పరిమితం కావాలి. ఇంటి ముందు వైపు స్లాబ్ పొడిగింపును గరిష్టంగా 3 అడుగులకే పరిమితం చేయాలని, మిగిలిన మూడు వైపులా కేవలం ఒక అడుగు మాత్రమే పొడిగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించాలి
భారీ ఆర్సీసీ స్లాబుల పొడిగింపునకు బదులుగా, కిటికీలు , తలుపులపై సాధారణ సన్షేడ్లు లేదా సజ్జాలను ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు ప్రభుత్వం సూచించింది. అలాగే, ఇంటి ముందు నీడ కోసం కాంక్రీట్ స్లాబ్ను వాడకుండా తక్కువ ఖర్చుతో కూడిన జి.ఐ షీట్లను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఈ సరికొత్త నిబంధనలపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!