Delhi: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర! సరిహద్దు్ల్లో రోడ్డుకు మేకులు, కాంక్రీట్ గోడ…
- తమ డిమాండ్లు పరిష్కరించాలని రైతుల నిరసన
- ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు
- నేడు మళ్లీ రైతుల పాదయాత్ర
- సరిహద్దు్ల్లో రోడ్డుకు మేకులు, కాంక్రీట్ గోడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల ‘జాతా’ ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
READ MORE: Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
రైతుల బృందం డిసెంబర్ 6 న ఢిల్లీ వైపు బయలుదేరింది. అయితే హర్యానా పోలీసులు వారిని శంభు సరిహద్దు వద్ద ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వారిని ఆపడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇందులో కనీసం 16 మంది రైతులు గాయపడ్డారు. దీని తరువాత, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ రెండు రోజుల పాటు ఢిల్లీ మార్చ్ను నిలిపివేశారు. కేంద్రం నుంచి చర్చల కోసం ఏదైనా ప్రతిపాదన వస్తే.. రేపటి వరకు వేచి ఉంటామన్నారు. కేంద్రంతో తమకు ఎలాంటి విభేదాలు అక్కర్లేదని.. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు.
READ MORE:Pushpa 2 : పుష్ప-2 టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది : మైత్రీ నిర్మాతలు
కాగా.. నేడు రైతులకు అడ్డుకునేందుకు నిరసనకారులు ఢిల్లీ వైపు వెళ్లకుండా సరిహద్దులో బారికేడింగ్ పటిష్టంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రోడ్లపై ఇనుప మేకులను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్తో పాటు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. ఈ సస్పెన్షన్ డిసెంబర్ 9 వరకు అమల్లో ఉంటుంది.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!