Delhi: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర! సరిహద్దు్ల్లో రోడ్డుకు మేకులు, కాంక్రీట్ గోడ…
- తమ డిమాండ్లు పరిష్కరించాలని రైతుల నిరసన
- ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు
- నేడు మళ్లీ రైతుల పాదయాత్ర
- సరిహద్దు్ల్లో రోడ్డుకు మేకులు, కాంక్రీట్ గోడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల ‘జాతా’ ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
READ MORE: Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్
Also Read
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
రైతుల బృందం డిసెంబర్ 6 న ఢిల్లీ వైపు బయలుదేరింది. అయితే హర్యానా పోలీసులు వారిని శంభు సరిహద్దు వద్ద ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వారిని ఆపడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇందులో కనీసం 16 మంది రైతులు గాయపడ్డారు. దీని తరువాత, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ రెండు రోజుల పాటు ఢిల్లీ మార్చ్ను నిలిపివేశారు. కేంద్రం నుంచి చర్చల కోసం ఏదైనా ప్రతిపాదన వస్తే.. రేపటి వరకు వేచి ఉంటామన్నారు. కేంద్రంతో తమకు ఎలాంటి విభేదాలు అక్కర్లేదని.. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు.
READ MORE:Pushpa 2 : పుష్ప-2 టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది : మైత్రీ నిర్మాతలు
కాగా.. నేడు రైతులకు అడ్డుకునేందుకు నిరసనకారులు ఢిల్లీ వైపు వెళ్లకుండా సరిహద్దులో బారికేడింగ్ పటిష్టంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రోడ్లపై ఇనుప మేకులను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్తో పాటు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. ఈ సస్పెన్షన్ డిసెంబర్ 9 వరకు అమల్లో ఉంటుంది.
తాజావార్తలు
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!