Jobs Scam Busted: నకిలీ విదేశీ ఉద్యోగాల కుంభకోణం.. లక్షలు కొల్లగొట్టిన ముగ్గురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jobs Scam Busted: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ విదేశీ ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టర్కీ, ఇథియోపియాలోని ప్రముఖ విదేశీ సంస్థల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 100 మందికి పైగా మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఢిల్లీ పోలీసులు మొదట 33 ఏళ్ల సోహైల్ నిజాంను అరెస్టు చేశారు. అనంతరం అతని సహచరులు అఫ్రోజ్ ఆలం(32), పర్వేజ్ ఆలం(42) అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తులు విలాసవంతమైన జీవనశైలిని గడపాలని కోరుకున్నారు. ‘ఏఆర్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో నకిలీ కంపెనీని ఏర్పాటు చేసి నేరాల మార్గాన్ని ఎంచుకున్నారు. వారు సోషల్ మీడియాలో సంస్థ గురించి ప్రచారం చేసి, నకిలీ వెబ్సైట్ను సృష్టించారు. అక్కడ వారు ఎప్పుడూ లేని విదేశీ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ ప్రకటనలను ఉంచారని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు టర్కీ, ఇథియోపియాలోని ప్రముఖ విదేశీ సంస్థల్లో అధిక వేతనం పొందుతున్న ఉద్యోగాల గురించి తమ వెబ్సైట్లో నకిలీ వివరాలను పోస్ట్ చేశారని, చెల్లింపులకు బదులుగా వారి బాధితులకు వాట్సాప్ ద్వారా నకిలీ జాబ్ ఆఫర్ లెటర్లను పంపారని పోలీసులకు చెప్పారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో తెలిపారు. నిందితులు బాధితుల పాస్పోర్టులను కూడా తమ వద్ద ఉంచుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్టాప్లు, 68 భారతీయ పాస్పోర్టులు, చైనా కంపెనీకి చెందిన నకిలీ జాబ్ ఆఫర్ లెటర్లు, టర్కీ, ఇథియోపియా దేశాల నకిలీ విమాన టికెట్ల కాపీలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Read Also: Youtube Fraud: యూట్యూబ్ చానల్ సబ్స్క్రిప్షన్ పేరుతో భారీ మోసం.. మహిళకు రూ.8 లక్షల టోకరా
టర్కీ, ఇథియోపియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏఆర్ ఎంటర్ప్రైజెస్కు చెందిన వ్యక్తులు తనను మోసం చేశారని దిలావర్ సింగ్ అనే వ్యక్తి సరితా విహార్ పోలీస్ స్టేషన్ను ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమకు డబ్బు చెల్లించిన తర్వాత నిందితులు తనకు నకిలీ ఈ-వీసా, జాబ్ ఆఫర్ లెటర్, విమాన టిక్కెట్ను పంపించారని దిలావర్ సింగ్ చెప్పారు. వెంటనే, వారు అతని కాల్స్ తీసుకోవడం మానేశారని పోలీసులు తెలిపారు. అతని ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, 468, 467, 471 – ఫోర్జరీ, చీటింగ్కు సంబంధించిన – సెక్షన్ 24, వలస చట్టంలోని సెక్షన్ 24 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.”సాంకేతిక నిఘా, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా, పోలీసు బృందం సోహైల్ నిజాంను పట్టుకుంది. విచారణ సమయంలో అతను తన నేరాన్ని అంగీకరించాడు. అతని సహచరులు అఫ్రోజ్ ఆలం, పర్వేజ్ ఆలం వరుసగా వారి నివాసాల్లో పట్టుబడ్డారు,” అని డీసీపీ చెప్పారు. రూ.50-60 లక్షల రూపాయల మోసాలకు పాల్పడిన వారి బ్యాంకు ఖాతాను కూడా స్తంభింపజేసినట్లు పోలీసులు తెలిపారు. వారి ఇతర సహచరులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..