Imran khan: భారత్ పై పొగడ్తలు గుప్పించిన పాక్ మాజీ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran khan: పాకిస్తాన్లో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారంనాడు లాంగ్ మార్చ్ ప్రారంభించారు. అసలే సంక్షోభంలో ఉన్న పాక్ పాలకులపై ఇమ్రాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ మరింత ఒత్తిడి పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లాహార్ నుంచి ఇస్లామాబాద్ వరకూ 380 కిలోమీటర్లు సాగే ఈ లాంగ్మార్చ్లో వేలాది మంది ప్రజలు వచ్చి చేరనున్నారని, మార్గమధ్యంలో పలు ర్యాలీలు నిర్వహిస్తామని ఇమ్రాన్ వర్గీయులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన ఇమ్రాన్ ఖాన్, భారీ ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ను మరోసారి కొనియాడారు. రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనుగోలు చేసిన భారత విదేశాంగ విధానాన్ని ఆయన మెచ్చుకున్నారు.
Read Also: Colour Change Dress: ఎండకు రంగులు మారే వెరైటీ డ్రెస్
Also Read
- Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
కూటమి భాగస్వాములు కొందరు ఫిరాయింపులకు పాల్పడటంతో గత ఏప్రిల్లో ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానంలో ఖాన్ ఓటమి పాలై అధికారం కోల్పోయారు. అయినప్పటికీ పబ్లిక్లో ఆయనకున్న ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు.ఇమ్రాన్ లాంగ్మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలకమైన కూడళ్లలో వందలాది షిప్పింగ్ కంటైనర్లు ఉంచారు. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నాలు జరిగినట్లయితే ప్రదర్శకులను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గత మేలో ఇదే తరహా నిరసన ప్రదర్శనల్లో ఖాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి.
కాగా, అరెస్టులతో సహా దేనికీ తాను భయపడేది లేదని ఇమ్రాన్ ఖాన్ గురువారం రాత్రి ఒక వీడియో సందేశంలో తెలిపారు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారని, స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించాలన్నదే వారి అభిమతమని అన్నారు. ఖాన్ ఇటీవల కాలంలో పలు ప్రదర్శనలు నిర్వహిస్తూ తన పాపులారీటీ తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. జనం సైతం ఆయన ర్యాలీలకు పెద్దఎత్తున హాజరవుతున్నారు. ఇటీవల జరిగి ఆరు ఉప ఎన్నికల్లో ఖాన్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకుంది.
Read Also: Nurse Behaviour with Patient: జుట్టు పట్టుకుని బెడ్ పైకి తోసి ఇంజక్షన్ చేసిన నర్స్
కాగా, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ అయిన ఇమ్రాన్ ఖాన్, భారత్ను పొగడం ఇదే తొలిసారి కాదు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన తర్వాత ఆయన పలుసార్లు భారత విదేశాంగ విధానాన్ని కొనియాడారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గని భారత్, రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేసిందని, స్వేచ్ఛాయుత దేశమంటే అలా ఉండాలంటూ కితాబు ఇచ్చారు.
- Tags
- Imran Khan
- long march
- Pakistan
- PTI
తాజావార్తలు
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!