Jagadish Reddy : ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ఉరి వేసే రోజులు దగ్గర పడ్డాయి..
- రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు
- సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు
- ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుంది : జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy : సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, “రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు. సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుంది” అంటూ మండిపడ్డారు. “15 నెలలు గడిచినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా సభలు సాగడం లేదు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ, “ప్రజలు ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది” అని జగదీష్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇస్తామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం NDSP సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటోందన్నారు. రైతులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి అని సూచించారు జగదీష్ రెడ్డి.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ధాన్యం కొనడం లేదని ఆయన ఆరోపించారు. ఎంత ధాన్యం కొన్నారు, ఎంత బోనస్ ఇచ్చారు? ప్రభుత్వం వద్ద సమాధానం లేదు అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. “హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఆయనకు కేసీఆర్ను తిట్టడం తప్ప వేరే పని లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం కక్కి ప్రజాక్షేత్రంలో బతకడం చాలా కష్టం. ప్రజలే త్వరలో కాంగ్రెస్ పార్టీకి తీర్పు చెప్తారు. కేసీఆర్ గురించి మాట్లాడనిదే రేవంత్ రెడ్డికి పూట గడవదు. గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని? ఇచ్చిన బోనస్ ఎంత? సమాధానం చెప్పాలి” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తన విమర్శలు గుప్పించారు జగదీష్ రెడ్డి.
Meerut murder case: జైల్లో నిందితులకు రామాయణం అందజేసిన నటుడు
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!