Odisha CM Naveen Patnaik: ఒడిశాలోని అన్ని జిల్లాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎలాంటి నోట్స్ చూడకుండా చెప్పలేడని ప్రధాన మంతరి నరేంద్ర మోడీ సవాల్ విసిరారు. శనివారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జిల్లాల పేర్లే గుర్తుండని వ్యక్తికి రాష్ట్రంలోని ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయని క్వశ్చన్ చేశారు. ప్రధాని మోడీ కామెంట్స్ పై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తనకు జిల్లాల పేర్లు గుర్తుండవని విమర్శలు చేసిన ప్రధానిపై సీఎం పట్నాయక్ మాట్లాడుతూ.. మోడీజీ.. ఒడిశాకు మీరు ఇచ్చిన హామీలలో మీకెన్ని గుర్తున్నాయని ప్రశ్నించారు.
Read Also: America : వృద్ధుడిని కారుతో తొక్కించి.. కత్తితో పొడిచి.. ట్రాన్స్ జెండర్ పైశాచికత్వం
అయితే, సంస్కృత భాష అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన మీరు ఒడియాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదు అని సీఎం నవీన్ పట్నాయక్ ప్రశ్నించారు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం తాను రెండు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికి వాటిని పట్టించుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఒడిశాలో ఎంతో మంది గొప్ప వాళ్లు, మహానుభావులు ఉన్నారో.. వారిలో కొందరి పేర్లనే మీరు మీ ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు.. అలాంటి మహనీయులు భారత రత్నకు అర్హులు కారా? ఒడిశా పుత్రుడు బిజూ పట్నాయక్ కు భారత రత్న పొందే అర్హత లేదా? అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా, ఎన్నికల సమయంలోనే ఒడిశాను గుర్తు చేసుకోవడం వల్ల మా రాష్ట్రానికి ఏలాంటి లాభం లేదన్నారు. 2014 – 2019 మధ్య కాలంలో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా? గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానమన్నారు.. జీఎస్టీ నుంచి మినహాయింపు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు ఇచ్చిన హామీలు ఎలా మర్చిపోయారంటూ? ప్రధాని మోడీపై నవీన్ పట్నాయక్ విరుచుకుపడ్డారు.