Asaduddin Owaisi: మీ గేదె పాలు ఇవ్వకపోయినా మాదే తప్పా?.. హిమంతకు ఒవైసీ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: అస్సాం ముఖ్యమంత్రి హిమంత భిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముస్లిం వ్యాపారుల్ని మియాలుగా సంబోధించిన హిమంత.. వారి వల్లే రాష్ట్రంలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓ మతం వారి వల్లే రేట్లు పెరుగుతున్నాయని సీఎం స్దానంలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారని అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం స్పందించారు. పెరుగుతున్న కూరగాయల ధరలను ముస్లిం వ్యాపారులకు లింక్ చేస్తూ ఆరోపణలు చేస్తున్న అస్సాం సీఎంపై ఒవైసీ మండిపడ్డారు. బహుశా వారు తమ వ్యక్తిగత వైఫల్యాలను “మియా భాయ్”పై వేసి ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
Also Read: Floods Effect: హిమాచల్లో వరుణ బీభత్సం.. రూ.2వేల కోట్లు మధ్యంతర సాయం కోరిన రాష్ట్రం
Also Read
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
ముస్లిం కూరగాయల విక్రేతలు కూరగాయల ధరలను పెంచుతున్నారని, అస్సామీ ప్రజలు కూరగాయలు విక్రయిస్తే, వారు ఎక్కువ వసూలు చేయరని సీఎం శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. కూరగాయల ధరలను ఇంతగా పెంచిన వ్యక్తులు ఎవరు? వారు మియా వ్యాపారులు, కూరగాయలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటూ శర్మ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అలాగే స్ధానికంగా అస్సాంలో నివసించే బెంగాలీ ముస్లింలను మియాలుగా పేర్కొంటారు. వారిని ఉద్దేశించే హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. వారు బయటి వ్యక్తులని, అస్సామీ సంస్కృతి, భాషను వక్రీకరించడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
హిమంత భిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ.. వారి ఇళ్లలో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి తమ ఇంట్లో గుడ్లు పెట్టకపోయినా కూడా మియా భాయ్ ను నిందించేవారు పెరిగిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా వారు తమ ‘వ్యక్తిగత’ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మియా భాయ్ను నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశీ ముస్లింలకు మధ్య లోతైన స్నేహం నడుస్తోందని ఏఐఎంఐఎం అధినేత ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ముస్లిం దేశాల్లో పర్యటిస్తున్న మోడీ.. అక్కడి నుంచి టమాటాలు, బచ్చలికూర, బంగాళదుంపలు మొదలైన వాటిని ఎగుమతి చేయాలని కోరాలన్నారు.
Also Read: Viral News: పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. తెరిచి చూసిన రైతు షాక్!
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్, ధుబ్రీ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ.. మియా ముస్లింలు గౌహతిలో కూరగాయలు, మసాలా విక్రయించడానికి అనుమతించబోమని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారని, సీఎం రాష్ట్రానికి అధినేత, ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం సరికాదన్నారు. ఆయన అలా అనకూడదన్నారు. ఇది తనకు నచ్చలేదని బద్రుద్దీన్ అజ్మల్ తెలిపారు. ఇదంతా చేస్తూ ముస్లింలు, అస్సామీ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, ఇంత జరిగిన తర్వాత కూడా ఏదైనా సంఘటన జరిగితే దానికి ప్రభుత్వం, సీఎం శర్మ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
God Of War : త్రివిక్రమ్ తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!