Etela Rajender: రుణ మాఫీ కింద కట్టింది కేవలం రూ.12 వేల కోట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకతీయ యూనివర్సిటీ లో పీహెచ్డీ అడ్మిషన్స్ లో అవకతవకలు జరిగాయి అని ఎబివిపి, ఇతర బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 10 మంది విద్యార్థులను టాస్క్ ఫోర్స్ పోలీస్ లు విచక్షణ రహితంగా కొట్టారు.. ఎమ్మెల్సీ అండదండలతో వీసీ రమేష్ బీఆర్ఎస్ కి తొత్తుగా వ్యవహరీస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Realme Narzo 60x: రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు అని ఈటెల రాజేందర్ అన్నారు. ఆ ఘనత కేసీఆర్ పాలన లోని రమేష్ కే దక్కింది.. అన్ని వర్సిటీలలో ఇలాంటి సంప్రదాయం వచ్చే అవకాశం ఉంది.. విద్యార్థుల డిమాండ్ కు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభుత్వం మొత్తం రుణ మాఫీ చేశామని చెప్పడం శుద్ద తప్పు అని ఈటెల అన్నారు.
Read Also: Love Marriage: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించి ఆశీర్వదించిన వైసీపీ ఎమ్మెల్యే
కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణ రైతులు ఎగవేత దారులుగా మిగిలారు అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రుణ మాఫీ కింద కట్టింది 12 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన ఆరోపించారు. సమయానికి డబ్బులు చెల్లించక పోవడం వల్ల రైతుల వడ్డీ పెరిగి పోయింది.. మంత్రి హరీష్ రావు వాళ్ల మీద వీళ్ళ మీద నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అన్నారు.
Read Also: Jaffer Sadiq: నక్క తోక తొక్కాడురా.. జవాన్ లోనూ కూడా జాఫర్ సాధిక్ రచ్చ
తెలంగాణ రైతులు అమాయకులు కాదు అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. వెంటనే బ్యాంక్ లకు మొత్తం పైకం చెల్లించి రైతులకు బకాయి లేకుండా చేసి.. కొత్త రుణాలు తీసుకునేలా చేయాలి అని ఈటెల డిమాండ్ చేశారు. భూములు అమ్మి రుణ మాఫీ చెల్లించారు.. లిక్కర్ టెండర్లు ముందుగా పిలిచారు.. దరఖాస్తు చేసుకున్నా.. వారు లక్షల్లో నష్ట పోయారు.. ఆ డబ్బులతో రుణమాఫీ చేశారు అని ఆయన ఆరోపించారు. డైట్ ఛార్జ్ లు సకాలంలో ఇవ్వక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం లభించడం లేదు అని ఈటెల రాజేందర్ అన్నారు.
Read Also:
అబద్దాల మాటలతో కేసీఆర్ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ మోసపు మాటలు నమ్మకండి.. ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ వన్… రైతులు సహా వివిధ వర్గాల వారు అత్నాహత్య చేసుకుంటున్నారు.. అప్పులలో, భూములు అమ్ముకోవడంలో నంబర్ వన్ అని ఆయన ఆరోపించారు. సాగర్ కింద నీళ్ళు లేక బావులు తవ్వుకుంటున్నారు.. ఎక్కడ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు.. ఇచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. ఎన్నికలు వచ్చాయి కాబట్టి అక్కడి దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూస్తున్నారు అక్కడ ప్రజలు విమర్శిస్తున్నారని పాలమూరు-రంగరెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభం అని నాటకం ఆడుతున్నారు అని ఈటెల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!