Etela Rajender : బీజేపీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఇస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు, బీఆర్ఎస్ నాయకులు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. ఆయనకు కాషాయ కండువా కప్పి ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అన్నీ వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న 75 మంది మంత్రుల్లో 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారని ఆయన అన్నారు. కేవలం బీజేపీలోనే ఇది సాధ్యం అయ్యిందమైందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 12 మంది ఎస్సీ లు, 8 మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారని, ఆదివాసీ మహిళకు అత్యున్నత స్థానం రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా బీజేపీనే అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి రాష్ట్రపతి ఎస్సీనీ చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు.
Also Read : Virinchi Varma: అసలు ఎవరీ జితేందర్ రెడ్డి? హిస్టరీ ఏంటి?
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
ప్రహ్లాద్ తో పాటు వెళ్తరెమో అని ములుగులో రెండు రోజులుగా ఇళ్లకు తాళాలు వేసి బెదిరిస్తున్నారట అంటూ ఈటల మండిపడ్డారు. నీ అబ్బ జాగీరా? పెన్షన్ డబ్బులు మావి తప్ప నీ ఇంట్లో నుండి ఇవ్వడం లేదని, పెన్షన్ తీసేసే దమ్ము ఏ పార్టీకి లేదన్నారు. మా పైసల మీద మీ పెత్తనం ఎంటి అని అడుగుతున్నామన్నారు ఈటల రాజేందర్. ఊపాసం ఉండి.. చదువుకున్న వారికి కాదు.. డబ్బులు ఇచ్చిన వారికే ఉద్యోగాలు అంటూ పేపర్లు లీకు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది అని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Viral Video : వాట్ ఏ టాలెంట్ గురూ.. నాలికతో గీసిన అద్భుతమైన కోహ్లీ చిత్రం..
అంతేకాకుండా..’హుజూరాబాద్ ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చింది. కేసీఆర్ డబ్బు సంచులకు, మందు సీసాలు లొంగలేదు. రేపు తెలంగాణ అంతా కూడా ఇదే రిపీట్ కాబోతుంది. ములుగు నియోజకవర్గంలో ఎగిరేది కాషాయ జెండా. ప్రహ్లాద్ గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.’ అని ఈటల వ్యాఖ్యానించారు.
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!