ENG vs AUS: 15 మంది ప్లేయర్స్ మాత్రమేనా.. ప్రపంచకప్కు మంచిది కాదు: ప్యాట్ కమిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins Feels ICC should allowe bigger squads in World Cups: వన్డే ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగే టోర్నీ అని, ఒక్కో జట్టుకు 15 మంది ఆటగాళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం సరికాదని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ వ్యవధిని దృష్టిలో ఉంచుకుని.. ఒక్కో జట్టు 15 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లను తీసుకునేలా అనుమతించాలని ఐసీసీని కోరాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ప్రపంచకప్ కోసం ఒక్కో జట్టు 15 మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. ప్రస్తుతం చాలా జట్లు గాయాల బారిన పడి సతమతం అవుతున్నాయి. ముఖ్యంగా న్యూజీలాండ్, ఆస్ట్రేలియా టీమ్స్. ఈ నేపథ్యంలోనే 15 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వాలని కమిన్స్ కోరుతున్నాడు.
గాయంతో గ్లెన్ మ్యాక్స్వెల్, వ్యక్తిగత కారణాల కారణంగా మిచెల్ మార్ష్ స్వదేశం వెళ్లడంతో వారు జట్టుకు దూరమయ్యారు. ఈ ఇద్దరు జట్టుకు కీలకం అన్న విషయం తెలిసిందే. ‘వన్డే ప్రపంచకప్ దాదాపు రెండు నెలల పాటు సాగుతుంది. న్యూజిలాండ్ జట్టు లాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోరు. కివీస్ జట్టు గాయాలతో సతమతం అవుతోంది. అయితే అదృష్టవశాత్తూ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను జట్టుతోనే ఉన్నాడు. కానీ అతడిని తప్పించాల్సి వస్తే.. అలాంటి పరిస్థితి క్రికెట్కు లేదా ప్రపంచకప్కు మంచిది కాదు. మ్యాచ్ కోసం అవసరమైన ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండాలి’ అని కమిన్స్ అన్నాడు.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
Also Read: Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
‘గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్ మా జట్టుకు కీలకం. సుదీర్ఘంగా సాగే ఈ టోర్నీలో ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి. పిచ్, కూర్పు లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే ప్రపంచకప్ టోర్నీకి 15 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకునేలా జట్లకు ఐసీసీ అనుమతి ఇవ్వాలి. అఫ్గానిస్థాన్తో మ్యాచ్కు మ్యాక్స్వెల్ అందుబాటులో ఉంటాడనుకుంటున్నా. మార్ష్ కూడా తిరిగొస్తాడు. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి. సెమీస్కు చేరువయ్యేకొద్దీ పూర్తిస్థాయి జట్టు అందుబాటులో ఉంటుంది. మా లక్ష్యం ఇప్పుడు సెమీస్కు చేరడం. ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్ ఆట చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!