Electric Bus For Tirumala: తిరుమలకు గేరు లేని బండి..హంగులెన్నో తెలుసాండీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం అంటేనే అదో అనుభూతి.. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాదిమంది భక్తులు ఆమలయప్పస్వామిని కనులారా వీక్షించి తరిస్తారు. నమో వేంకటేశాయ అనే మంత్రం విని పులకాంకితులు అవుతారు. త్వరలో తిరుమల బ్రహోత్సవ శోభతో అలరారనుంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ ఒకటి తిరుమలకు రానుంది.
రైల్ రన్ కోసం ప్రస్తుతానికి అలిపిరి డిపోకు వచ్చింది ఏసీ విద్యుత్తు బస్సు. దీనిని అత్యాధునిక సాంకే తిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో గేరు వ్యవస్థ ఉండదు. డ్రైవర్ సీటు వద్ద బ్రేకు, ఎక్స్ లేటర్ మాత్రమే ఉంటాయి. వైఫైతో పాటు డిస్ ప్లే స్క్రీన్, వాకీ టాకీ, ముందు వెనుక సీసీ కెమెరాలు ఉన్నాయి. ఛార్జింగ్ పోర్టుకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
Also Read
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
Read Also: Jammu Kashmir: కాశ్మీర్పై ఇస్లామిక్ దేశాల ప్రేలాపన.. సొంతింటిని చక్కదిద్దుకోండని భారత్ ఘాటు సమాధానం
ఈ ఎలక్ట్రిక్ బస్సుకి పూర్తిగా అద్దాలు మూసి ఉండటంతో ప్రతి విండో వద్ద అత్యవసర ఏర్పాట్లు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఈ బస్ ని ఆసక్తిగా తిలకించారు. డిపోలో ఛార్జింగ్ పాయింట్ వ్యవస్థ నిర్మాణంలో ఉంది. ఇప్పటికే ఛార్జింగ్ పాయింట్ బాక్సులు డిపోకు చేరుకున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే సుమారు 240 కిలోమీటర్లు వరకు ఛార్జింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 21న ప్రారంభం చేయనున్నట్లు అలిపిరి డిపో మేనేజర్ హరిబాబు తెలిపారు.
మరోవైపు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలుకు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. గరుడ సేవకు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. బ్రహ్మోత్సవాలకు 7 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతపై త్వరలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇఓ ధర్మారెడ్డితో సమావేశం నిర్వహించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.
Read Also: Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?