Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను బుధవారం నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్:
• ఈనెల 27న సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల వరకు ధ్వజారోహణం జరుగుతుంది. అదేరోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.
• సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగుతాయి.
• సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరుగుతాయి.
• సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ జరుగుతాయి.
• అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.
• అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం (స్వర్ణ రథం) జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ జరుగుతుంది.
• అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతాయి.
• అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం) జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీవారు ఊరేగింపు జరుగుతుంది.
• అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
కాగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. గరుడ సేవకు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. బ్రహ్మోత్సవాలకు 7 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతపై త్వరలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ధర్మారెడ్డితో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!