Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. ఏ రోజు ఏ వాహన సేవ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను బుధవారం నాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 26న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్:
• ఈనెల 27న సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల వరకు ధ్వజారోహణం జరుగుతుంది. అదేరోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.
• సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగుతాయి.
• సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవ జరుగుతాయి.
• సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ జరుగుతాయి.
• అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.
• అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం (స్వర్ణ రథం) జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ జరుగుతుంది.
• అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతాయి.
• అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం) జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీవారు ఊరేగింపు జరుగుతుంది.
• అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Also Read
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
కాగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. గరుడ సేవకు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. బ్రహ్మోత్సవాలకు 7 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల భద్రతపై త్వరలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో ధర్మారెడ్డితో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!