Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Eknath Shinde Govt To Stay As Supreme Court Says Cant Give Relief To Uddhav Thackeray Over Maharashtra Political Crisis

Maharashtra Political Crisis: సీఎం షిండేకు సుప్రీంలో ఊరట.. ఉద్ధవ్‌ రాజీనామా చేయకుంటే..

Published Date :May 11, 2023 , 1:35 pm
By Mahesh Jakki
Maharashtra Political Crisis: సీఎం షిండేకు సుప్రీంలో ఊరట.. ఉద్ధవ్‌ రాజీనామా చేయకుంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో జూన్ 2022 రాజకీయ సంక్షోభంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తన ఉత్తర్వును ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తూ, ఉద్ధవ్ థాకరే బలపరీక్షను ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.”ఉద్ధవ్ రాజీనామా చేసి, బలపరీక్షను ఎదుర్కొని ఉంటే ఉపశమనం అందించబడేది. గవర్నర్ విశ్వాస పరీక్షకు పిలవకూడదు, కానీ ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసినందున, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఏక్‌నాథ్ షిండేను పిలవడం సమర్థించబడుతోంది” అని కోర్టు పేర్కొంది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోర్టు ప్రస్తావించింది. శివసేన ఉద్ధవ్ వర్గం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం విచారణ జరిపింది. పార్టీల వివాదం పరిష్కారానికి విశ్వాస పరీక్ష ఒక్కటే మార్గం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణపై ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం వెల్లడించింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. అయితే గతేడాది జూన్‌ 30న బల నిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి గవర్నర్‌ ఆదేశించటం సమర్థనీయం కాదని….అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. నబం రేజియా జడ్జిమెంట్, అనర్హత పిటిషన్లు పెండింగ్, స్పీకర్ పాత్ర తదితర అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

‘చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదు. బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ సమ్మతం కాదు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష ఎదుర్కోలేదు. తిరిగి ఆయనను సీఎంగా నియమించలేం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో మహారాష్ట్రలో షిండే సర్కార్‌కు ఢోకా లేదు. ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి తీర్పు ఎదురుదెబ్బగానే భావించాలి. రాజకీయ సంక్షోభం సమయంలో స్పీకర్‌ ఎలాంటి పాత్రను నిర్వహించాలన్న విషయంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోబోతంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుంటే కోర్టు ఆయనకు ఉపశమనం కలిగించేదని సీజేఐ తీర్పులో వెల్లడించడం విశేషం. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం మార్చి 16న తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరఫున కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే వర్గం తరఫున హరీశ్ సాల్వే, ఎన్‌కే కౌల్, మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు.

Read Also: Supreme Court: కేజ్రీవాల్ సర్కారుకు బిగ్ రిలీఫ్‌.. ఢిల్లీ పాలనా వ్యవహారాలపై సుప్రీం కీలక తీర్పు

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి పదవిని పంచుకునే అంశంపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో బంధాన్ని తెంచుకుంది. థాక్రే తర్వాత రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కాంగ్రెస్‌తో జతకట్టారు.ఏక్‌నాథ్ షిండే, 39 మంది ఇతర శాసనసభ్యులు సేన నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో గత ఏడాది మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. జూన్ 30న, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ షిండే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • eknath shinde
  • maha politics
  • Maharashtra Governor
  • Maharashtra political crisis
  • Supreme Court

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions